Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పట్టపగలు నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

 మయూరి హోటల్ ముందు మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసు, శాంతినగర్ లోని మహిళ మెడలో నుంచి బైక్ పై వచ్చి వచ్చి తులం గొలుసు ఎత్తుకెళ్లినట్టుగా ఆరోపిస్తూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

పట్టపగలు నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ
Chain Snatched
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 23, 2024 | 1:23 PM

నిర్మల్ జిల్లా కేంద్రంలో దొంగలు పెట్రేగిపోతున్నారు. పట్టపగలే దారి దోపిడీలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ హల్‌చల్‌ చేస్తున్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళల మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు దుండగులు. నిర్మల్‌లోని మయూరి హోటల్‌ ముందు నడుచు కుంటూ వెళ్తున్న మహిళ మెడల్లోంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గోల్డ్‌ చైన్‌ లాగేశారు.  అటు, మరోచోట కూడా ఇలాంటి ఘటనే జరిగింది.   మయూరి హోటల్ ముందు మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసు, శాంతినగర్ లోని మహిళ మెడలో నుంచి బైక్ పై వచ్చి వచ్చి తులం గొలుసు ఎత్తుకెళ్లినట్టుగా ఆరోపిస్తూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..