AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. బాయిల్డ్ రైస్ కొనుగోళ్లపై కీలక ప్రకటన..

తెలంగాణకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొద్ది నెలలుగా బాయిల్డ్ రైస్ కొనుగోళ్లపై కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోంది. ఈనేపధ్యంలో ఉప్పుడు బియ్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన చేసింది. 2021-22 రబీ సీజన్ కు గాను

Telangana: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. బాయిల్డ్ రైస్ కొనుగోళ్లపై కీలక ప్రకటన..
Rice
Amarnadh Daneti
|

Updated on: Aug 11, 2022 | 2:28 PM

Share

Telangana: తెలంగాణకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొద్ది నెలలుగా బాయిల్డ్ రైస్ కొనుగోళ్లపై కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోంది. ఈనేపధ్యంలో ఉప్పుడు బియ్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన చేసింది. 2021-22 రబీ సీజన్ కు గాను తెలంగాణ నుంచి ఫుడ్ కార్పోరేషన్ ఇండియా- ఎఫ్ సీఐ ద్వారా 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సేకరించేందుకు అంగీకారం తెలిపింది. ఈమేరకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.

కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం, అన్నదాత సమస్యల పరిష్కారం దిశగా తమ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తెలంగాణ 6.05 లోల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని కేంద్రప్రభుత్వం సేకరిస్తుండగా.. దీనికి అదనంగా మరో 8లోల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు ముందుకొచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. భారత ఆహార సంస్థ -FCI వద్ద మూడేళ్లకు సరిపడా ఉప్పుడు బియ్యం నిల్వలు ఉన్నప్పటికి తెలంగాణ రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే కేంద్రం ఈనిర్ణయం తీసుకుందన్నారు. రైతుల పట్ల సానుకూల ధృక్పదంతో తెలంగాణలో బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పియూష్ గోయల్ కు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..