టార్గెట్ తెలంగాణ.. 2028లో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడు! రంగంలోకి మాస్టర్ మైండ్లు
బెంగాల్ విజయం తర్వాత తెలంగాణపై బీజేపీ పూర్తి దృష్టి సారించింది. 2028 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని, దక్షిణాదిలో పాగా వేయడానికి కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ వంటి వ్యూహకర్తలతో సంస్థాగతంగా బలపడాలని చూస్తున్నారు. హిందూ కార్డు, బూత్ స్థాయి బలోపేతం ద్వారా అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అపోజిషన్ పార్టీని ఓడగొట్టి డైరెక్ట్గా కుర్చీనెక్కేశాం. బిహార్లో సొంత కూటమిలోనే ఈక్వేషన్లు అటుఇటూ మార్చి ఇన్డైరెక్ట్గా పాగా వేశాం.. వాట్ నెక్ట్స్ అని ఇండియా మ్యాప్ను ముందరేసుకుని దీర్ఘంగా సోచాయిస్తోంది కమలం పార్టీ కేంద్ర బెటాలియన్. అలుపూ సొలుపూ లేకుండా ఆలిండియాలో అలవోకగా మిత్రులతో కలిసి 22 రాష్ట్రాల్లో పవర్లోకొచ్చిన బీజేపీ.. ఒక్కటి తగ్గింది అని సౌత్ వైపు సీరియస్గా చూస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తమిళనాడు, కేరళ కొరకరాని కొయ్యలని ఇటీవలి ఎన్నికల్లో తేలిపోయింది. కర్నాటకలో పూర్వ వైభవం సంతరించుకోడానికి చాలాకాలమే పట్టేటట్టుంది. ఇక, మిగిలిందల్లా తెలంగాణ ఒక్కటే. దక్షిణాదిలోకి తమకు సాఫ్ట్ టార్గెట్ తెలంగాణ మాత్రమనేనని పార్టీ పెద్దలు ఇప్పటికే సెలవిచ్చేశారు. తెలంగాణలో అధికారానికి చాలా దగ్గర్లో ఉన్నామన్న ఫీలింగ్ని క్యాడర్లోకి ఇంజెక్ట్ చేస్తూనే ఉన్నారు లీడర్లు. కానీ, పవర్లో ఉన్న కాంగ్రెస్నీ, ఆల్రెడీ పదేళ్లు పవర్ని టేస్ట్ చేసిన బీఆర్ఎస్ని ఒంటిచేత్తో నలిపెయ్యడం ఎలా సాధ్యం..? అందుకే, కీలెరిగి వాతపెట్టే పేరుమోసిన ఒక నాటువైద్యుణ్ణి తెలంగాణకు పంపుతోందట అధిష్టానం. మరి, ఆపరేషన్ తెలంగాణ.. ఈసారైనా సక్సెస్ ఔతుందా? బెంగాల్లో కొట్టిన ఘరానా విక్టరీ తర్వాత నేరుగా తెలంగాణలో దిగింది బీజేపీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. బెంగాల్లో కష్టపడిందానికంటే ఎక్కువగా రెండింతలు చెమటోడ్చాలి.. అని క్యాడర్కి మాంచి బూస్ట్నిస్తోంది. మిగిలున్న సమయం రెండున్నరేళ్లే మిత్రమా! ఈసారి టార్గెట్ మిస్సవ్వొద్దు సుమా! అని దూకుడు పెంచేసింది. ఆ రెండు...
