Amit Shah: తెలంగాణ ప్రజల నాడి తెలుసు.. వచ్చే ప్రభుత్వం మాదే.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..

కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పల్స్ తెలుసని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడుతుందని అమిత్ షా పేర్కొన్నారు.

Amit Shah: తెలంగాణ ప్రజల నాడి తెలుసు.. వచ్చే ప్రభుత్వం మాదే.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..
Amit Shah
Follow us

|

Updated on: Nov 26, 2022 | 7:44 AM

Amit Shah on Telangana: కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పల్స్ తెలుసని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడుతుందని అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో అధికారం చేపడతామని ధీమా వ్యక్తంచేశారు. ఓ జాతీయ మీడియా సదస్సులో పాల్గొన్న హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణలో బీజేపీ పాగాపై కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ సౌత్ ఎంట్రీకీ తెలంగాణ గేట్ వే అంటూ పేర్కొన్న అమిత్ షా.. కచ్చితంగా తెలంగాణలో పాగా వేస్తామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీమెజార్టీతో గెలుస్తామని.. తెలంగాణలో తప్పనిసరిగా మార్పు వస్తుందని తెలిపారు. తానే స్వయంగా తెలంగాణకు వెళ్లి తీరుతానని.. బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అంటూ పేర్కొన్నారు.

తెలంగాణలో ఈసారి ప్రభుత్వం మాదేనని అమిత్‌షా పేర్కొన్నారు. కింది స్థాయి వరకు ప్రజల నాడి తనకు తెలుసని.. తెలంగాణలో బీజేపీకి గాలి వీస్తోందన్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా ఎగుర వేస్తామన్నారు అమిత్‌షా. తెలంగాణకు వెళ్లి పార్టీని గెలిపిస్తామన్నారు. ఓవైపు కేసీఆర్‌ బీజేపీపై యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో అమిత్‌షా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..