AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఆర్‌పీసీ 41ఏ నోటీసు రద్దు చేయండి.. తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్

రెండు రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు బీఎల్ సంతోష్ కి మరోసారి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. దీంతో ఈ కేసులో 41ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో బీఎల్ సంతోష్ పాటు..

సీఆర్‌పీసీ 41ఏ నోటీసు రద్దు చేయండి.. తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన బీజేపీ అగ్రనేత  బీఎల్ సంతోష్
Bjp Leader Bl Santosh
Sanjay Kasula
|

Updated on: Nov 25, 2022 | 3:00 PM

Share

తెలంగాణ హైకోర్టులో శుక్రవారంనాడు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్. నిన్ననే రెండోసారి సిట్ అధికారులు బీఎల్ సంతోష్ కి 41 ఏ సీఆర్‌సీపీ కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు బీఎల్ సంతోష్ కి మరోసారి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. దీంతో ఈ కేసులో 41ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో బీఎల్ సంతోష్ పాటు తుషార్, జగ్గు స్వామిలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని మోమో ద్వారా హైకోర్టుకు సిట్ తెలిపింది. బిఎల్ సంతోష్ తరఫున వాదనలు వినిపిస్తున్నారు మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి.

ఈ కేసులో అరెస్టైన నిందితులు బీఎల్ సంతోష్‌తో మాట్లాడినట్టుగా సిట్ వాదిస్తుంది. ఈ కేసులో సంతోష్‌ను విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ వాదిస్తోంది. ఎమ్మెల్యేలతో నిందితులు మాట్లాడినట్టుగా బయటకు వచ్చినట్టుగా ఉన్న ఆడియోలు, వీడియోల్లో కూడా సంతోష్ పేరును కూడా ఉపయోగించారు. ఈ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ బీజేపీ నేత బీఎల్ సంతోష్ ఇవాళ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వాదనలు జరుగుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం