AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: ఇచ్చిన హామీలు BRS అమలుచేయలేదా.. అమిత్‌షా ఆరోపణలకు రియాక్షన్‌ ఏంటి?

తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌ గర్జనలో ప్రసంగించిన అమిత్‌షా.. కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. డిసెంబర్‌3న ఫలితాల్లో బీజేపీ విజయం ఖాయమన్న అమిత్‌షా.. ఢిల్లీలోనూ గల్లీలోనూ మోదీయే ఉండాలన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కేసీఆర్‌ విఫలం అయితే..

Big News Big Debate: ఇచ్చిన హామీలు BRS అమలుచేయలేదా.. అమిత్‌షా ఆరోపణలకు రియాక్షన్‌ ఏంటి?
Big News Big Debate
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 10, 2023 | 6:51 PM

తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌ గర్జనలో ప్రసంగించిన అమిత్‌షా.. కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. డిసెంబర్‌3న ఫలితాల్లో బీజేపీ విజయం ఖాయమన్న అమిత్‌షా.. ఢిల్లీలోనూ గల్లీలోనూ మోదీయే ఉండాలన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కేసీఆర్‌ విఫలం అయితే.. అక్టోబర్‌లో రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు హామీలు అమలు చేశారన్నారు. కేవలం కేటీఆర్ ను ఎలా సీఎంను చేయాలనే కేసీఆర్ ఆలోచిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు.

గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని మోదీ నిర్ణయించినా కేసీఆర్ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు. చివరకు మోదీ 900 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నారు.

కేసీఆర్‌ నెంబర్‌వన్‌ రాష్ట్రం అని చెబుతున్నారు. నిజమే నెంబర్‌ వన్‌ చేశారు. ఉపాధి కల్పించడంలోనా, తాగునీరు ఇవ్వడంలోనా, ఉద్యోగాలు ఇవ్వడంలోనా కాదు, రైతు ఆత్మహత్యల్లో దేశంలో నెంబర్‌వన్‌, మహిళలు, చిన్నారులపై దాడుల్లో నెంబర్‌వన్‌, అవినీతిలోనూ నెంబర్‌వన్‌ అయింది.

పదేళ్లుగా కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని ఎలా చేయాలా అని ఆలోచించారు. ఈ ముఖ్యమంత్రి కేవలం తన కొడుకును సీఎం చేయడమే లక్ష్యం. కానీ మా లక్ష్యం ఆదిలాబాద్‌ గిరిజన బిడ్డలకు ఉద్యోగాలు, విద్య, రైతులకు నీరు అందించడం మా లక్ష్యం.

కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఎక్కడ..? దళితులకు మూడెకరాలు ఎక్కడ? దళిత బంధు అందరికీ ఇచ్చారా..? మీ కార్యకర్తలను ఇచ్చుకున్నారు.. మిగిలినవారి సంగతేంటి?

గిరిజన వర్శిటీ మోదీ ప్రకటించారు. పసుపు బోర్డు ప్రకటించారు. మూడోది కృష్టా బోర్డు ట్రిబ్యునల్‌ విధివిధానాలు క్యాబినెట్‌లో ఇచ్చారు.

తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం రావాలి. డబుల్‌ ఇంజిన్‌ అంటే అక్కడ మోదీ, ఇక్కడా మోదీ.

అంబాసిడార్‌ కారు ఉంది ఇక్కడ.. దీనిని ఎవరు నడిపిస్తారు. కారు స్టీరింగ్‌ వాళ్ల దగ్గర లేదు. ఒవైసీ చేతిలో ఉంది. తెలంగాణను మజ్లిస్‌ చేతిలో పెడతామా?

నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయోధ్య రామాలయ నిర్మాణం జరుగుతోంది. జనవరిలో ప్రారంభించుకుంటున్నాం. అలాగే పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేసి తీవ్రవాదులను ఏరివేశారు.

బిగ్ న్యూస్ బిగ్ డిడేట్ లైవ్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..