Amit Shah: అధికారమే లక్ష్యంగా స్పీడు పెంచిన కాషాయ దళం.. తెలంగాణకు బీజేపీ అగ్రనేతల రాక..
Telangana Assembly elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో భారతీయ జనతా పార్టీ జోరు పెంచింది. ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కట్టనున్నారు. ఇవాళ్టి నుంచి అగ్రనేతల వరుస పర్యటనలు ఉండేలా బీజేపీ ప్రచార షెడ్యూల్ను ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు.

Telangana Assembly elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో భారతీయ జనతా పార్టీ జోరు పెంచింది. ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కట్టనున్నారు. ఇవాళ్టి నుంచి అగ్రనేతల వరుస పర్యటనలు ఉండేలా బీజేపీ ప్రచార షెడ్యూల్ను ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మ.12:35కు బేగంపేటకు చేరుకొని.. ఒంటిగంటకు జనగామ సభలో పాల్గొంటారు అమిత్ షా. మధ్యాహ్నం 3 గంటలకు కోరుట్ల బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం 5:30 గంటలకి ఉప్పల్లో అమిత్షా రోడ్ షో చేస్తారు. మళ్లీ రాత్రికి తిరిగి ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు. అయితే రెండు రోజుల క్రితమే తెలంగాణకు వచ్చిన అమిత్షా బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. సూర్యాపేట, వరంగల్ బహిరంగ సభల్లో పాల్గొన్న అమిత్ షా క్యాడర్లో జోష్ నింపారు.
మరో బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీ ఇవాళ తెలంగాణకు వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఎల్లారెడ్డి, కొల్లాపూర్ సభల్లో గడ్కరీ ప్రసంగించనున్నారు. మరో బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఇవాళ హైదరాబాద్కు వస్తున్నారు. ముషీరాబాద్లో బీజేపీ అభ్యర్థి తరపున రోడ్షోలో పఢ్నవీస్ పాల్గొంటారు. అలాగే ఈనెల 21న తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పీయూష్ గోయల్ తెలంగాణకు వస్తున్నారు. ఈయన కూడా రెండు సభల్లో పాల్గొంటారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 24, 25, 26 తేదీల్లో యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ఈనెల 25, 26న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలంగాణలో పర్యటిస్తారు. హుజూరాబాద్, మహేశ్వరం సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
వీరితో పాటు అసోం సీఎం, గోవా సీఎం కూడా వచ్చే వారం ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు రానున్నారు. అలాగే బీజేపీ ఎన్నికల ప్రచారం మోదీతో ఎండింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది బీజేపీ. దీని కోసం వచ్చే వారం మోదీ మరోసారి తెలంగాణ వస్తారని చెప్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. ఇవాళ్టి నుంచి బీజేపీ అగ్రనేతల రాకతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..