AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kothagudem: అమ్యామ్యాలకు అలవాటు పడి అడ్డంగా బుక్కయిన అటవీ అధికారులు..

కొత్తగూడెం అటవీ శాఖలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు రూ.28 లక్షల లంచం డిమాండ్ చేసి, మొదటి విడతగా రూ.3.50 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. .. ..

Kothagudem: అమ్యామ్యాలకు అలవాటు పడి అడ్డంగా బుక్కయిన అటవీ అధికారులు..
ACB raid
N Narayana Rao
| Edited By: |

Updated on: Jan 04, 2026 | 12:14 PM

Share

కొత్తగూడెం అటవీ శాఖలో ఏసీబీ దాడులు సంచలనంగా మారాయి. ఏకంగా రూ.28 లక్షల లంచం డిమాండ్ చేశారంటే వీళ్లు మామూలు అధికారులు కాదని జనం చర్చించుకుంటున్నారు. ఇంత భారీ మొత్తంలో లంచం అడగడం, మొదటి విడతగా రూ.3.50 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద కేసుగా మారింది. ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో డివిజనల్ మేనేజర్‌గా పనిచేస్తున్న తాటి శ్రావణి, ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్‌లు తమ కింది స్థాయి అధికారుల ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో అధికారులు వారిని పట్టుకున్నారు. ఫారెస్ట్‌లో జామాయిల్ చెట్ల కటింగ్ కాంట్రాక్టును దక్కించుకున్న ఓ వ్యక్తికి, చెట్ల కటింగ్‌కు గాను ఒక్కో టన్నుకు రూ.750 చొప్పున ప్రభుత్వం చెల్లించేలా ఒప్పందం ఉంది. అయితే ఆ బిల్లులను క్లియర్ చేయాలంటే చండ్రుగొండ మండలం సీతాయి గూడెంలో ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్, అతని పై అధికారి శ్రావణి కలిసి ఒక్కో టన్నుకు రూ.150 చొప్పున మొత్తం 32 వేల టన్నులకు గాను రూ.28 లక్షలకు పైగా లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించాడు.

లంచం డిమాండ్‌ను భరించలేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగారు. చర్చల అనంతరం టన్నుకు రూ.90 చొప్పున కుదిర్చుకుని, మొదటి బిల్లుకు సంబంధించిన రూ.3.50 లక్షలను లంచంగా ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఈ మొత్తాన్ని తీసుకునేందుకు వచ్చిన సూపర్‌వైజర్ కృష్ణయ్యను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో భాగంగా అధికారులు కార్యాలయాలతో పాటు సంబంధిత అధికారుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. సేకరించిన ఆధారాల ఆధారంగా సూపర్‌వైజర్ కృష్ణయ్యతో పాటు డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణి, ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇద్దరు అధికారులు హైదరాబాద్‌లో ఉన్నారని, వారు తిరిగి వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ, ఏ పని చేయించేందుకు అయినా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని కూడా ఆయన భరోసా ఇచ్చారు.

Follow Us
శని నక్షత్ర సంచారం.. ఈ రాశి వారికి సమస్యలు తప్పవు!
శని నక్షత్ర సంచారం.. ఈ రాశి వారికి సమస్యలు తప్పవు!
అక్షయ తృతీయ వేళ భారీ ఊరట? బంగారం,వెండి ధరలపై కేంద్రం బిగ్‌డెసిషన్
అక్షయ తృతీయ వేళ భారీ ఊరట? బంగారం,వెండి ధరలపై కేంద్రం బిగ్‌డెసిషన్
ఉదయాన్నే ఒక్క గ్లాసు ఈ నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
ఉదయాన్నే ఒక్క గ్లాసు ఈ నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
పుచ్చకాయ గింజలను నమిలి తింటే ఏమవుతుందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు
పుచ్చకాయ గింజలను నమిలి తింటే ఏమవుతుందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు
3 నెలలుగా అద్దె కట్టని వ్యక్తి.. యజమాని వచ్చి చూసేసరికి..
3 నెలలుగా అద్దె కట్టని వ్యక్తి.. యజమాని వచ్చి చూసేసరికి..
వామ్మో.. గోళ్లు కొరికే అలవాటు ఎంత పనిచేసిందో చూడండి..
వామ్మో.. గోళ్లు కొరికే అలవాటు ఎంత పనిచేసిందో చూడండి..
మామిడి పండు తిని టెంక పడేస్తున్నారా? అయితే మీరు నష్టపోతున్నట్టే
మామిడి పండు తిని టెంక పడేస్తున్నారా? అయితే మీరు నష్టపోతున్నట్టే
మహిళా బిల్లుపై మ్యాజిక్ ఫిగర్ మోదీ సర్కార్‌కు సాధ్యమేనా?
మహిళా బిల్లుపై మ్యాజిక్ ఫిగర్ మోదీ సర్కార్‌కు సాధ్యమేనా?
అక్షయతృతీయ రోజు ఇలా లక్ష్మీపూజ చేస్తే.. మీ ఇంట్లో అష్టైశ్వార్యాలే
అక్షయతృతీయ రోజు ఇలా లక్ష్మీపూజ చేస్తే.. మీ ఇంట్లో అష్టైశ్వార్యాలే
పీజీ మెడికో సురేష్ మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు
పీజీ మెడికో సురేష్ మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు