AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Kagar: కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌.. భద్రతా బలగాల కాల్పుల్లో 28 మంది మావోలు హతం!

తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టలలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు సమాచారం. మావోయిస్టులను ఏరిపారేయాలనే ఉద్దేశంలో భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్‌ను చేపట్టిన విషయం తెలిసిందే.

Operation Kagar: కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌.. భద్రతా బలగాల కాల్పుల్లో 28 మంది మావోలు హతం!
Chhattisgarh Encounter
Anand T
|

Updated on: Apr 26, 2025 | 12:00 PM

Share

తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. వారి నుంచి భద్రాతా బలగాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ ఛత్తీస్‌గఢ్‌ వైపు జరిగినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ఇంకా చాలా మంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో దాదాపు 8000 మంది భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు సమాచారం.

గత కొన్ని రోజులుగా మావోయిస్టులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారత్‌ను మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని పలు సందర్భాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా అన్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు సుప్రీం కమాండర్ హిడ్మాతో పాటు భారీగా మావోయిస్టులు కర్రెగుట్టల్లో ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. వారిని ఏరిపారేయాలనే ఉద్దేశంలో భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్‌ను చేపట్టారు. ఇందులో భాగంగా ములుగు జిల్లాలోని కర్రెగుట్ట ప్రాంతంలో గత ఐదు రోజులుగా కూబింగ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌ కౌంటర్‌లో తాజాగా 28 మంది మావోయిస్టులు మృతి చెందారు.

అయితే భద్రత బలగాల ఆపరేషన్‌తో బెదిరిపోయిన మావోయిస్టులు.. కర్రెగుట్టల వద్ద జరుగుతున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపేయాలని మావోయిస్టు బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేష్ పేరుతో  నిన్న ఓ లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే. శాంతి చర్చలకు ముందుకు రావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని. ఒక నెల సైనిక చర్య వాయిదా వేసి చర్చలకు జరపాలని మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో రాసుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..