Telangana: ‘నా చావుకు నేనే కారణం’ అనుమానాస్పదంగా భీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌ కలకలం

సంగారెడ్డ జిల్లా పరిధిలోని అరూర్‌ గ్రామానికి చెందిన మన్నే అశోక్‌ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి సదాశివపేట పట్టణంలోని గురునగర్‌ కాలనీలో నివసిస్తున్నాడు. అశోక్‌ పెద్ద కుమార్తె శివానీ (17) హైదరాబాద్‌లో భీఫార్మసీ చదువుతుంది. ఏం జరిగిందో తెలియదుగానీ రెండు నెలల క్రితం శివానీ సదాశివపేటలోని తమ ఇంటికి వచ్చింది. వచ్చినప్పటి నుంచి మనస్తాపంతో ఉండేది. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేది కాదు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో..

Telangana: 'నా చావుకు నేనే కారణం' అనుమానాస్పదంగా భీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌ కలకలం
B Pharmacy Student Committed Suicide
Follow us

|

Updated on: Apr 16, 2024 | 10:57 AM

సదాశివపేట, ఏప్రిల్ 16: మనస్తాపంతో బీఫార్మసీ చదువుతోన్న ఓ విద్యార్ధిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సదాశివపేట పట్టణంలోని గురునగర్‌ కాలనీలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సంగారెడ్డ జిల్లా పరిధిలోని అరూర్‌ గ్రామానికి చెందిన మన్నే అశోక్‌ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి సదాశివపేట పట్టణంలోని గురునగర్‌ కాలనీలో నివసిస్తున్నాడు. అశోక్‌ పెద్ద కుమార్తె శివానీ (17) హైదరాబాద్‌లో భీఫార్మసీ చదువుతుంది. ఏం జరిగిందో తెలియదుగానీ రెండు నెలల క్రితం శివానీ సదాశివపేటలోని తమ ఇంటికి వచ్చింది. వచ్చినప్పటి నుంచి మనస్తాపంతో ఉండేది. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేది కాదు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని శివానీ ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఇంటి తలుపులు తెరచి చూడగా ఫ్యాన్‌కు విగత జీవిగా వేలాడుతూ కనిపించింది. కళ్ల ముందు ఉన్న బిడ్డ ఏం కష్టం వచ్చిందో ఇలా అర్ధాంతరంగా జీవితం ముగించిందో అర్ధంకాకా ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువతి రాసిన సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తనకు ఇతరులకు సహాయపడటం చాలా ఇష్టమని, తన తల్లిదండ్రుల అనుమతితో తన శరీరంరోని అవయవాలను దానం చేయాలని కోరుతున్నానని లెటర్‌లో పేర్కొంది. తాను లేకున్నా తన అవయవాల వల్ల మరో ఇద్దరు జీవిస్తారని తెల్పింది. తన చావుకు తానే కారణమని, దయచేసి ఎలాంటి విచారణ చేయొద్దని లేఖలో పేర్కొంది. శివానీ బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో ఆమె అవయవాలు పనికిరావని వైద్యులు పేర్కొన్నారు. మృతురాలి తండ్రి అశోక్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు సీఐ మహేశ్‌ గౌడ్‌ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
దంచికొడుతున్న ఎండలు.. ఎండల్లో కార్లల్లో ఆ జాగ్రత్తలు తప్పనిసరి
దంచికొడుతున్న ఎండలు.. ఎండల్లో కార్లల్లో ఆ జాగ్రత్తలు తప్పనిసరి
మేనిఫెస్టో సాక్షిగా.. చంద్రబాబు, పవన్ సమక్షంలో బయటపడ్డ విబేధాలు
మేనిఫెస్టో సాక్షిగా.. చంద్రబాబు, పవన్ సమక్షంలో బయటపడ్డ విబేధాలు
కంటి చూపుకు పదును పెట్టే జీడిపప్పు.. తింటున్నారా?
కంటి చూపుకు పదును పెట్టే జీడిపప్పు.. తింటున్నారా?
సూపర్ ఫీచర్స్‌తో పల్సర్ 400 లాంచ్.. ఆకట్టుకుంటున్న నయా టీజర్
సూపర్ ఫీచర్స్‌తో పల్సర్ 400 లాంచ్.. ఆకట్టుకుంటున్న నయా టీజర్
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే..
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే..
జర జరుగు.. వచ్చేసింది మరో ‘జెమినీ’.. ఆ ఫోన్లలో కూడా వాడేయొచ్చు..
జర జరుగు.. వచ్చేసింది మరో ‘జెమినీ’.. ఆ ఫోన్లలో కూడా వాడేయొచ్చు..
షారుక్‌ కుమారుడు అబ్రామ్ సందడి మాములుగా లేదుగా..
షారుక్‌ కుమారుడు అబ్రామ్ సందడి మాములుగా లేదుగా..
బీజేపీలో ఫుల్ జోష్.. జహీరాబాద్‌లో ప్రధాని మోదీ ప్రసంగం..
బీజేపీలో ఫుల్ జోష్.. జహీరాబాద్‌లో ప్రధాని మోదీ ప్రసంగం..
కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తక్కువ బడ్జెట్‌లో ఉన్న కార్లు
కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తక్కువ బడ్జెట్‌లో ఉన్న కార్లు
సౌతాఫ్రికా నుంచి ఇంగ్లండ్ వరకు అన్ని జట్లు స్వ్కాడ్స్..
సౌతాఫ్రికా నుంచి ఇంగ్లండ్ వరకు అన్ని జట్లు స్వ్కాడ్స్..