Drones: విపత్తుల సమయంలో మనుషులను రక్షించేందుకు సహకరించే డ్రోన్..ఇది శబ్దాల్లో తేడాలను గుర్తిస్తుంది!

Drones: జర్మనీ శాస్త్రవేత్తలు ఒక డ్రోన్‌ను రూపొందించారు. ఇది ప్రకృతి విపత్తులో చిక్కుకున్న ప్రజలను వారి ఏడుపులను వినడం ద్వారా రక్షించగలదు.

Drones: విపత్తుల సమయంలో మనుషులను రక్షించేందుకు సహకరించే డ్రోన్..ఇది శబ్దాల్లో తేడాలను గుర్తిస్తుంది!
Drone For Help
Follow us

|

Updated on: Jul 02, 2021 | 4:57 PM

Drones: జర్మనీ శాస్త్రవేత్తలు ఒక డ్రోన్‌ను రూపొందించారు. ఇది ప్రకృతి విపత్తులో చిక్కుకున్న ప్రజలను వారి ఏడుపులను వినడం ద్వారా రక్షించగలదు. కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఈ డ్రోన్ మానవులు, జంతువులు, పక్షుల రెక్కల శబ్దం మధ్య తేడాలను గుర్తించగలదు. ఈ డ్రోన్ పరీక్షల సమయంలో మనుషుల అరుపులు, చప్పట్లు కొట్టడం.. ఇతర శబ్దాలు వంటి అన్నిటినీ గుర్తించగలిగింది. దీనిని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ డ్రోన్ ల సహాయంతో భవిష్యత్ లో పలు రకాల సహాయ కార్యక్రమాలను చేపట్టడానికి అవకాశం ఉంది.

బాధితులను కూడా పసిగట్టవచ్చు.. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం, విపత్తులో చిక్కుకున్న ప్రజల వాసనను గుర్తించే విధంగా డ్రోన్ ను రూపొందించారు. బ్లడ్హౌండ్ జాతి కుక్కలు వాసన వాసన ద్వారా మానవులను గుర్తిస్తాయి. ఎక్కడైనా ఒక భవనం కూలిపోయింది అనుకోండి. అటువంటి పరిస్థితిలో ఆ శిధిలాల కింద ఎవరైనా మానవులు ఉన్నారా అనే విషయం తెలుసుకోవడానికి ఈ కుక్కలను ఉపయోగిస్తారు. అదే విధంగా ఈ డ్రోన్ లు కూడా ఇలాంటి పని చేయగలవు. అక్కడ కనిపెట్టిన మానవుల సమాచారంతో ఈ డ్రోన్ లు రెస్క్యూ టీంను అప్రమత్తం చేయగలదని దీనిని తయారుచేసిన బృందంలోని సభ్యురాలు వారెలా చెప్పారు.

శాస్త్రవేత్తలు డ్రోన్ల డేటాబేస్లో ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తుల వివిధ రకాల స్వరాలను చేర్చారు. అరవడం, చప్పట్లు కొట్టడం, తన్నడం వంటి శబ్దాలు రికార్డ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో, డ్రోన్ అటువంటి శబ్దాలకు స్పందించేలా శిక్షణ ఇచ్చారు. శాస్త్రవేత్తలు పక్షి రెక్కల శబ్దం..గాలి చప్పుడు..గాలి మోటారు శబ్దాన్ని దాని డేటాబేస్లో చేర్చారు. తద్వారా ఇది విపత్తు సమయంలో మానవులకు, అలాంటి శబ్దాలకు మధ్య గందరగోళానికి గురి అవడం లేదా తప్పు సమాచారాన్ని ఇవ్వడం చేయదు.

ఇది చాలా చిన్న డిజిటల్ మైక్రోఫోన్‌ను కలిగి ఉంటుంది. ఇది ధ్వనిని వినగలదు. ఈ డ్రోన్ క్షేత్ర పరీక్షలలో విజయవంతమైంది. పరీక్ష సమయంలో, కొన్ని సెకన్లలో, ఇది పరిశోధకుడి అరుపు శబ్దాన్ని గుర్తించి అక్కడే ఆగిపోయింది. సహాయ బృందానికి సహాయం చేస్తుంది

భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలలో, ప్రాణాలను కాపాడటానికి ప్రతి సెకను ముఖ్యం, అటువంటి పరిస్థితిలో కొత్త డ్రోన్ చాలా సహాయకారిగా ఉంటుంది. డ్రోన్ తక్కువ సమయంలో సులభంగా పెద్ద ప్రాంతానికి చేరుకోగలదు. విపత్తు నుండి ప్రజలను రక్షించే బృందానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

Also Read: Radio: ప్రపంచ సమాచార వ్యవస్థ గతినే మార్చిన రేడియో.. ఈ ఆవిష్కరణ కోసం మార్కోనీ ఏం చేశాడో తెలుసా?

Rocket Launch: విమానం ద్వారా విజయవంతంగా అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగం సక్సెస్..నిర్ణీత కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాలు

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు