Redmi 9c: రూ.9వేలలోపే రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌.. 128జీబీ స్టోరేజీ.. అద్భుతమైన ఫీచర్స్‌

Redmi 9c: షియోమీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీలో దూసుకుపోతోంది. మార్కెట్లో కొత్త కొత్త వేరియంట్లతో ఫోన్‌లను విడుదల చేస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే అద్భుతమైన..

Redmi 9c: రూ.9వేలలోపే రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌.. 128జీబీ స్టోరేజీ.. అద్భుతమైన ఫీచర్స్‌
Redmi 9c
Follow us

|

Updated on: Aug 02, 2021 | 1:12 PM

Redmi 9c: షియోమీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీలో దూసుకుపోతోంది. మార్కెట్లో కొత్త కొత్త వేరియంట్లతో ఫోన్‌లను విడుదల చేస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే అద్భుతమైన ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆపిల్‌ను సైతం షియోమీ వెనక్కి నెట్టిసింది. ఈ నేపథ్యంలో తక్కువ ధరల్లో కస్టమర్లకు స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది షియోమీ. తాజాగా రెడ్‌మీ 9సీ స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ మలేషియాలో విడుదలైంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. గతంలో ఇందులో 2 జీబీ ర్యామ్/3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్/64 జీబీ స్టోరేజ్ వేరియంట్లు మార్కెట్లోకి రాగా, తాజాగా కొత్తగా హైఎండ్ వేరియంట్‌ను కూడా తీసుకువచ్చారు.

రెడ్‌మీ 9సీ ధర ఎంతంటే..

కొత్తగా మార్కెట్లోకి విడుదలైన ఈ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 499 మలేషియా రింగెట్లుగా(మనదేశ కరెన్సీలో సుమారు రూ.8,780) నిర్ణయించారు. దీనికి సంబంధించిన సేల్ మలేషియాలో ఆగస్టు 3వ తేదీ నుంచి జరగనుంది. ఈ మొబైల్‌ బ్లూ, ఆరెంజ్ రంగుల్లో అందుబాటులో ఉంది.

రెడ్‌మీ 9సీ స్పెసిఫికేషన్లు

రెడ్‌మీ 9సీ ఫోన్‌ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్‌ కానుంది. ఇందులో 6.53 అంగుళాల హెచ్ డీ+ ఎల్సీడీ డాట్ డ్రాప్ డిస్ ప్లేను అందించారు. దీని డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 4 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ను అందించారు. స్టోరేజ్ ను మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

కెమెరా విషయానికొస్తే..

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా విషయానికొస్తే.. వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్‌ కాగా, 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. ఇందులో బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే ఏఐ ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా ఉంది.

ఇవీ కూడా చదవండి

Flipkart Big Saving Days Sale: మరో బంపర్ ఆఫర్లతో కస్టమర్ల ముందుకు రానున్న ఫ్లిప్‌కార్ట్‌.. ఎప్పటి నుంచి అంటే..!

Reliance Jio Offers: జియో కస్టమర్లకు ఇక పండగే.. బై వన్‌ గెట్‌ ఫ్రీ వన్‌ ఆఫర్‌.. ఎవరికి అంటే..!

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు