Electric Vehicles: రోడ్డే రీఛార్జి స్టేషన్.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక రహదారులు సిద్ధం అవుతున్నాయి.. ఇవి ఎలా పనిచేస్తాయంటే..

KVD Varma

KVD Varma |

Updated on: Dec 01, 2021 | 7:04 PM

ఒకవైపు ఇంధనాల ధరలు పెరిగిపోతున్నాయి. మరోవైపు పర్యావరణ పరిస్థితులు ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగం ప్రోత్సహించాలని దాదాపుగా అన్నిదేశాల ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Electric Vehicles: రోడ్డే రీఛార్జి స్టేషన్.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక రహదారులు సిద్ధం అవుతున్నాయి.. ఇవి ఎలా పనిచేస్తాయంటే..
Electric Vehicle Charging

Electric Vehicles: ఒకవైపు ఇంధనాల ధరలు పెరిగిపోతున్నాయి. మరోవైపు పర్యావరణ పరిస్థితులు ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగం ప్రోత్సహించాలని దాదాపుగా అన్నిదేశాల ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేశాయి. అత్యంత ఆధునిక ఫీచర్లతో చాలా వేరియంట్ల ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, ఈ సంవత్సరం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మొత్తం కార్ల అమ్మకాలలో 4 శాతం కంటే తక్కువగా ఉండవచ్చని అంచనా. దూర ప్రయాణాల్లో సులభంగా రీఛార్జ్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఎలక్ట్రిక్ వాహనం పరిధి, ఛార్జింగ్ సమయం, ఛార్జింగ్ స్టేషన్ లభ్యత అన్నీ ప్రస్తుతానికి సుదూర కలగా అనిపిస్తున్నాయి.

ఛార్జింగ్ సమయం కూడా పెద్ద సమస్య. ఈ సమస్యను పరిష్కరించడానికి సరికొత్త ఆలోచన చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేక రహదారులను నిర్మించడానికి కృషి చేస్తున్నారు పరిశోధకులు. ఇది కార్లు కదిలినప్పుడు కూడా ఛార్జింగ్ చేస్తుంది. ఇందుకోసం ఇండక్టివ్ ఛార్జింగ్ అనే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. వచ్చే సంవత్సరం జూలైలో, ఇండియానా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్, పర్డ్యూ యూనివర్సిటీ ప్రపంచంలోనే మొట్టమొదటి వైర్‌లెస్ ఛార్జింగ్ కాంక్రీట్ హైవేని ప్లాన్ చేస్తున్నాయి.

ఆస్పైర్ అనే ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తోంది. ఇది నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నుండి నిధులు పొందుతోంది. రోడ్డుపై ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడమే మా లక్ష్యం అని ఆస్పైర్ క్యాంపస్ డైరెక్టర్ నదియా చెప్పారు. దీని కోసం, అయస్కాంత కాంక్రీటు సాంకేతికత ఉపయోగిస్తారు. దీనిలో ఐరన్ ఆక్సైడ్, నికెల్, జింక్ వంటి లోహ మూలకాలు మిశ్రమంగా ఉంటాయి. ఈ కాంక్రీటును జర్మన్ కంపెనీ మాగ్మెంట్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం, ఈ సాంకేతికత అనేక దశల్లో పరీక్షలు జరుపుకుంటోంది. ఇది మొబైల్ ఫోన్‌ను వైర్‌లెస్‌గా ఛార్జ్ చేయడం లాంటి ప్రక్రియగా చెప్పుకోవచ్చు.

కాంక్రీట్ మిశ్రమంలో కరెంట్ అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది

కాంక్రీట్ మిశ్రమం ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని అమలు చేయడం ద్వారా రోడ్డు అయస్కాంతీకరణకు గురి అవుతుంది. ఇది వైర్‌లెస్‌గా శక్తిని అందించడం ద్వారా వాహనాన్ని ఛార్జ్ చేసే అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. పేటెంట్ పొందిన మెటీరియల్‌తో తయారు చేసిన 12 అడుగుల పొడవు 4 అడుగుల వెడల్పు గల ప్లేట్ లేదా పెట్టె రోడ్డుపై కొన్ని అంగుళాల దూరంలో పాతిపెడతారు. ఈ పెట్టెను పవర్ గ్రిడ్‌కు కనెక్ట్ చేయడం ద్వారా, కరెంట్ దానిలో నడుస్తుంది. ఇది రోడ్డు ద్వారా ప్రసారం చేస్తారు. ఇది రహదారిపై నడుస్తున్న EVకి శక్తినిస్తుంది. ఈ శక్తి కారులో అమర్చబడిన చిన్న పెట్టె ద్వారా పవర్ పొందుతుంది. దాని ద్వారా ఈవీ లోని బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి: Omicron Spread: వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్..మరో రెండు దేశాల్లో కలకలం..ఒమిక్రాన్ లేటెస్ట్‌ అప్‌డేట్స్

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్ ఆకలితో పాకిస్తాన్ వ్యాపారం.. భారత్ చేస్తున్న సహాయాన్ని తనదిగా చెప్పుకునే ప్రయాస!

Social Media: సోషల్ మీడియాలో మీ ఎకౌంట్ తీసేయాలని అనుకుంటున్నారా? ఇలా చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu