Cyber Crime: ప్రతి 10 మందిలో నలుగురు సైబర్ క్రైమ్ బాధితులే.. తాజా సర్వేలో విస్తుపోయే నిజాలు..
Cyber Crime: రోజురోజుకీ టెక్నాలజీ ఎలా మారుతుందో నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. మారుతోన్న టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకున్న నేరస్థులు సరికొత్త పంథాను ఎంచుకొని మోసాలకు పాల్పడుతున్నారు...
Cyber Crime: రోజురోజుకీ టెక్నాలజీ ఎలా మారుతుందో నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. మారుతోన్న టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకున్న నేరస్థులు సరికొత్త పంథాను ఎంచుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగిన నేపథ్యంలో మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఎంతో మంది సైబర్ మోసాల బారిన పడుతూ డబ్బులు కోల్పోతున్నారు. దేశ వ్యాప్తంగా గడిచిన మూడేళ్లలో తాము లేదా తమ కుటుంబంలో ఒకరు ఆర్థిక మోసానికి గురైనట్లు 42 శాతం తెలిపారంటనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
‘లోకల్ సర్కిల్స్’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఇలాంటి ఎన్నో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దేశంలోన ప్రతినెల 80 వేల సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. వీటి విలవ అక్షరాల రూ. 200 కోట్లని సర్వే తెలిపింది. అయితే ఈ కేసుల్లో రికవరీ మాత్రం ఆశించిన స్థాయిలో ఉండడం లేదు.
మూడేళ్లలో నమోదైన కేసుల్లో కేవలం 17 శాతం కేసుల్లో మాత్రమే బాధితుల సొమ్మును రికవదీ చేయడం గమనార్హం. సగటున ప్రతి 10 మందిలో నలుగురు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు సర్వేలో తేలింది. అయితే వ్యక్తిగత తప్పులు, అవగాహన లోపం వల్లే ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..