Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
Whatsapp: ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్లో కచ్చితంగా ఉండే యాప్స్లో వాట్సాప్ ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్గా వాట్సాప్కు పేరుంది...
Whatsapp: ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్లో కచ్చితంగా ఉండే యాప్స్లో వాట్సాప్ ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్గా వాట్సాప్కు పేరుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది కాబట్టే ఈ యాప్కు ఇంతటి క్రేజ్ ఉంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో వాట్సాప్ వరుసగా కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్ను తీసుకొచ్చే పనిలో పడిందీ మెసేజింగ్ యాప్.
వాట్సాప్ డిస్ప్లే పిక్చర్ (డీపీ) స్థానంలో ఇకపై సొంత అవతార్స్ను పెట్టుకునే అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్ డెవలపింగ్ స్టేజ్లో ఉంది. ఇది పూర్తికాగానే టెస్టింగ్ నిర్వహించి అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని డబ్ల్యూఏ బేటా ఇన్ఫో అధికారికంగా వెల్లడించింది. అవతార్స్ను డీపీగా ఎలా సెట్ చేసుకోవచ్చే తెలిపే ఒక ఫొటోను విడుదల చేశారు. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ కొత్త ఫీచర్ సహాయంతో బ్యాక్గ్రౌండ్ కలర్ను మార్చుకునే అవాకశం లభించనుంది.
అంతేకాకుండా వీడియో కాల్స్ చేసినప్పుడు కూడా ఇలాంటి యానిమేటెడ్ అవతార్ రూపంలో కాల్ మాట్లాడే వీలు కల్పించనున్నారు. ఇదిలా ఉంటే వాట్సాప్ ఇప్పటికే యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ సమయాన్ని రెండు రోజులకు పెంచనున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ప్రొఫైల్ పిక్చర్ ఎవరికి కనిపించాలో కూడా సెట్ చేసుకునే అవకాశం కల్పించేలా ఓ ఫీచర్ను తీసుకొచ్చిన విషం తెలిసిందే.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..