AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Social Media: సంచలన నిర్ణయం.. ఇకపై 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్‌!

వినియోగదారులు వయోపరిమితిలోపు ఉండేలా చూసుకోవడం సోషల్ మీడియా, టెక్ కంపెనీల బాధ్యత అని అన్నారు. ఈ బాధ్యత పిల్లల తల్లిదండ్రులపై ఉండదన్నారు. ఎందుకంటే పిల్లల ఆన్‌లైన్ భద్రత గురించి వారు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారని అన్నారు.

Social Media: సంచలన నిర్ణయం.. ఇకపై 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్‌!
ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ దీని గురించి మాట్లాడుతూ.. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించేలా చట్టం చేశామన్నారు. ఈ నేప‌థ్యంలో వ‌య‌స్సు వెరిఫికేష‌న్ విధానం త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపానే. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
Subhash Goud
|

Updated on: Nov 07, 2024 | 5:31 PM

Share

పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ వ్యసనం పెరగడం సర్వసాధారణమైపోయింది. మొబైల్ ఫోన్ల వల్ల పిల్లలు చదువుతో పాటు శారీరక శ్రమకు దూరమవుతున్నారు. దీంతో వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. అటువంటి పరిస్థితిలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ గురువారం వెల్లడించారు. పిల్లల భద్రతకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవడంలో టెక్ కంపెనీలు విఫలమయ్యాయని ఆస్ట్రేలియా ప్రధాని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వం ఈ చర్య తీసుకోనుంది. ఈ నిర్ణయం తల్లిదండ్రుల కోసమేనని ఆయన తెలిపారు. నిజానికి సోషల్ మీడియా పిల్లలకు హాని చేస్తోంది. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోంది.

ఆంథోనీ అల్బనీస్ ఈ సంవత్సరం ప్రారంభంలో సోషల్ మీడియా వినియోగం గురించి చాలా మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా వినియోగంపై వయోపరిమితి విధించడంపై ఆయన మాట్లాడటం ఇదేం తొలిసారి కాదు. ఈ నిర్ణయం ప్రభావం మెటా ప్లాట్‌ఫారమ్‌లైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో పాటు టిక్‌టాక్, ఎక్స్ లపై కనిపిస్తుందని ఆస్ట్రేలియా కమ్యూనికేషన్స్ మంత్రి మిచెల్ రోలాండ్ చెప్పారు.

వినియోగదారులు వయోపరిమితిలోపు ఉండేలా చూసుకోవడం సోషల్ మీడియా, టెక్ కంపెనీల బాధ్యత అని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అన్నారు. ఈ బాధ్యత పిల్లల తల్లిదండ్రులపై ఉండదన్నారు. ఎందుకంటే పిల్లల ఆన్‌లైన్ భద్రత గురించి వారు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ నిర్ణయానికి సానుకూల స్పందన

సోషల్ మీడియా వినియోగానికి వయోపరిమితిని నిర్ణయించాలన్న నిర్ణయానికి సానుకూల మద్దతు లభించింది. కొత్త చట్టాలను ఈ వారంలోగా వెల్లడిస్తామని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. దీంతో పాటు నవంబర్‌లో ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆస్ట్రేలియా నుండి ప్రారంభమవుతుందని, భవిష్యత్తులో దీని ప్రభావం ఇతర దేశాలలో కూడా కనిపిస్తుందని ఆయన అన్నారు. సామాజిక మాధ్యమాల వల్ల చిన్నారులకు హాని కలుగుతోంది. అందుకే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Malware Attack: ఆండ్రాయిడ్‌ యూజర్లకు పెను ముప్పు.. మొబైళ్లలో మరో కొత్త మాల్వేర్‌!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి