AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా పేలవ ప్రదర్శన.. తృటిలో పతకం కోల్పోయిన సచిన్..

మన బల్లెం వీరుడు నీరజ్ చోప్రా తో పాటు పాకిస్తాన్ కి చెందిన అర్షద్ నదీమ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఓడిపోయారు. అయితే మన దేశానికే చెందిన సచిన్ యాదవ్ కేవలం 40 సెంటీమీటర్ల తేడాతో పతకం కోల్పోయాడు. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలవలేకపోయాడు. నీరజ్ చోప్రా 84.03 మీటర్లు మాత్రమే విసిరాడు. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ కూడా విఫలమయ్యాడు.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా పేలవ ప్రదర్శన.. తృటిలో పతకం కోల్పోయిన సచిన్..
World Athletics Championshi
Surya Kala
|

Updated on: Sep 18, 2025 | 5:48 PM

Share

ఒలింపిక్ బంగారు పతక విజేత భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చాలా పేలవమైన ప్రదర్శనతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నుంచి నిష్క్రమించాడు. జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఈ పోటీలో నీరజ్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. జావెలిన్ త్రో ఫైనల్‌లో అతను 84.03 మీటర్ల దూరాన్ని మాత్రమే అధిగమించగలిగాడు. నీరజ్ తన మొదటి త్రోను 83.65 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత అతని ప్రదర్శన నిరంతరం క్షీణించింది. ఎంతగా అంటే నీరజ్ కనీసం టాప్ 6లోకి కూడా అడుగు పెట్టలేకపోయాడు. తద్వారా అతను ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ పోటీ నుంచి నిష్క్రమించాడు. నీరజ్ చోప్రాతో పాటు పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ కూడా పేలవమైన ప్రదర్శన చేశాడు. అర్షద్ 82.73 మీటర్ల దూరం మాత్రమే అధిగమించగలిగాడు. దీంతో అతను కూడా టాప్ 6లోకి చేరుకోలేకపోయాడు. అయితే మనదేశానికి చెందిన సచిన్ యాదవ్ పతకంపై ఆశలు కలిగించాడు. కేవలం 40 సెంటీమీటర్ల తేడాతో పతకాన్ని కోల్పోయాడు.

నీరజ్ చోప్రా ప్రదర్శన ఎలా సాగిందంటే..

  1. నీరజ్ చోప్రా తన మొదటి త్రోలోనే 83.65 మీటర్ల దూరం విసిరాడు.
  2. రెండవ త్రో 84.03 మీటర్లను విసిరి మొదటి ప్రదర్శనని అధిగమించాడు.
  3. నీరజ్ మూడో త్రోను ఫౌల్ చేశాడు.
  4. నీరజ్ చోప్రా నాల్గవ త్రోలో జావెలిన్ 82.86 మీటర్లు దూసుకెళ్లింది.
  5. ఇవి కూడా చదవండి
  6. నీరజ్ చోప్రా వేసిన ఐదవ త్రో కూడా ఫౌల్ అవ్వడం విశేషం
  7. తన బలాన్ని చూపించిన సచిన్ యాదవ్

ఆసక్తికరంగా భారతదేశపు రెండవ జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్ 86.27 మీటర్ల దూరం విసిరి నీరజ్ చోప్రాను అధిగమించాడు. అతను నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్ వంటి అనుభవజ్ఞులను అధిగమించాడు. యాదవ్ నాల్గవ స్థానంలో నిలిచాడు. సచిన్ తన కెరీర్-బెస్ట్ ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు.

ఛాంపియన్ గా వాల్కాట్

ట్రినిడాడ్, టొబాగోకు చెందిన వాల్కాట్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అతను 88.16 మీటర్లు విసిరి ఈ టైటిల్‌ను సాధించాడు. గ్రెనడాకు చెందిన పీటర్స్ 87.38 మీటర్లు విసిరి రెండవ స్థానంలో నిలిచాడు. అమెరికాకు చెందిన కర్టిస్ థాంప్సన్ 86.67 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..