చరిత్ర సృష్టించిన టెన్నిస్ స్టార్ సానియా..
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఫెడ్ కప్ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డు నెగ్గిన
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఫెడ్ కప్ హార్ట్ అవార్డును భారత ఏస్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కైవసం చేసుకుంది. ఆసియా/ఓషియానియా జోన్ నుంచి సానియా ఈ అవార్డుకు ఎంపికైంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్గా రికార్డులకెక్కింది. ఈ నెల 1 నుంచి వారం రోజుల పాటు జరిగిన ఆన్లైన్ ఓటింగ్లో 16985 మంది పాల్గొనగా 10 వేల పైచిలుకు ఓట్లతో ఆసియా పసిఫిక్ జోన్లో ఉన్న సానియా విజేతగా నిలిచింది. విజేతకు ఇచ్చే రూ. 1.5 లక్షలను ఆమె తెలంగాణ సీఎం సహాయ నిధికి పంపించింది.
దాదాపు రెండేళ్ల తర్వాత ఫెడ్కప్లో పునరాగమనం చేసిన సానియా.. భారత్ను ప్లే ఆఫ్స్కు చేర్చడంలో కీలకపాత్ర పోషించింది. సానియా అంతర్జాతీయ కెరీర్లో ఆరు డబుల్స్ గ్రాండ్స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. అలాగే గతంలో ఆమె మహిళల డబుల్స్ నెం.1 ర్యాంకులో కూడా నిలిచింది. తనకు దక్కిన సందర్భంగా సానియా ఇలా స్పందించారు…ఈ అవార్డును దేశంతోపాటు నా అభిమానులకు అంకితమిస్తున్నా. నాకు ఓటేసిన వారందరికీ కృతజ్ఞతలు. భవిష్యత్తులో దేశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తానని ఆశిస్తున్నా’నని పేర్కొంది.