Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో మను భాకర్కు అరుదైన గౌరవం.. అదేంటంటే?
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ డబుల్ కాంస్య పతక విజేత షూటర్ మను భాకర్ ఒలింపిక్ క్రీడల ముగింపు కార్యక్రమంలో భారత ఫ్లాగ్ బేరర్గా ఎంపికైంది. ముగింపు వేడుక ఆగస్టు 11న ఫ్రాన్స్ రాజధానిలో జరగనుంది. మను ఒకే ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యం తర్వాత ఒలింపిక్స్లో భారతీయ క్రీడాకారుడు రెండు పతకాలు సాధించడం ఇదే తొలిసారి.
![Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో మను భాకర్కు అరుదైన గౌరవం.. అదేంటంటే?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/manu-bhaker-10.jpg?w=1280)
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ డబుల్ కాంస్య పతక విజేత షూటర్ మను భాకర్ ఒలింపిక్ క్రీడల ముగింపు కార్యక్రమంలో భారత ఫ్లాగ్ బేరర్గా ఎంపికైంది. ముగింపు వేడుక ఆగస్టు 11న ఫ్రాన్స్ రాజధానిలో జరగనుంది. మను ఒకే ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యం తర్వాత ఒలింపిక్స్లో భారతీయ క్రీడాకారుడు రెండు పతకాలు సాధించడం ఇదే తొలిసారి.
రెండు పతకాలు సాధించిన మను..
హర్యానాకు చెందిన 22 ఏళ్ల మను మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని సాధించి భారత్ పతక ఖాతా తెరిచింది. ఆ తర్వాత ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జిత్ సింగ్తో కలిసి రెండవ కాంస్య పతకాన్ని సాధించింది. ఆ తర్వాత జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ పోటీల్లోనూ మను పతకం సాధించే అవకాశం వచ్చింది. కానీ, తృటిలో పతకాన్ని కోల్పోవడంతో పోటీని నాలుగో స్థానంలో ముగించింది.
IOA ఏం చెప్పింది?
ఫ్లాగ్ బేరర్గా మను భాకర్ ఎంపిక గురించి తెలియజేస్తూ, ముగింపు వేడుకలో పిస్టల్ షూటర్ మను భాకర్ భారతదేశానికి ఫ్లాగ్ బేరర్గా ఉండనుందని IOA ప్రెసిడెంట్ డాక్టర్ పీటీ ఉష, హెడ్ టీమ్ రిప్రజెంటేటివ్ గగన్ నారంగ్ ప్రకటించారు. అలాగే, పురుషులను త్వరలోనే ఎంపిక చేస్తామని ఆమె తెలిపారు.
రేపు అంటే ఆగస్టు 6న భారత్ ఒలింపిక్స్లో పలు పోటీల్లో పాల్గొంటుండగా, భారత్కు స్వర్ణం ఆశగా నిలిచిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కూడా రేపు రంగంలోకి దిగుతున్నాడు. అతనితో పాటు వినేష్ ఫోగట్ కూడా రెజ్లింగ్ బరిలో నిలిచాడు. మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమయ్యే రెజ్లింగ్లో మహిళల ఫ్రీస్టైల్ 50 కిలోల విభాగంలో వినేష్ ఫోగట్ రౌండ్ ఆఫ్ 16లో పోటీపడతాడు. అలాగే మధ్యాహ్నం 3:20 గంటలకు అథ్లెటిక్స్లో పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్లో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా పాల్గొంటాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..