Tokyo Olympics: క్విజ్, డిబేట్లు, చర్చలు… టోక్యో ఒలిపింక్స్పై దేశవ్యాప్త కార్యక్రమాలు…
Tokyo Olympics: సాయ్, ఐఓఏ.. మెగా ఈవెంట్స్కు సంబంధించి పలు కార్యక్రమాల మీద అవగాహన కల్పిస్తాయి. ఒలింపిక్స్ విజేతలకు సంబంధించి క్విజ్, డిబేట్లు, చర్చలు, ఆర్టికల్స్, స్లోగన్లు, ఇలా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టోక్యో ఒలింపిక్స్పై దేశవ్యాప్తంగా ఒలింపిక్స్ గురించి అవగాహన కల్పించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్లు ముందుకొచ్చాయి. టోక్యో ఒలింపిక్స్లో భారత అథ్లెట్స్ పాల్గొననున్న నేపథ్యంలో ఈ మేరకు సంయుక్త నిర్ణయం తీసుకున్నాయి. సాయ్, ఐఓఏ.. మెగా ఈవెంట్స్కు సంబంధించి పలు కార్యక్రమాల మీద అవగాహన కల్పిస్తాయి. ఒలింపిక్స్ విజేతలకు సంబంధించి క్విజ్, డిబేట్లు, చర్చలు, ఆర్టికల్స్, స్లోగన్లు, ఇలా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఇందులో సామాజిక మాధ్యమాలు కూడా పెద్ద పాత్ర పోషించనున్నాయి.జులై 25 నుంచి సెప్టెంబర్ 5 వరకు టోక్యో ఒలింపిక్స్ను నిర్వహించాలని సంకల్పించారు నిర్వాహకులు. 11 ఆటల కేటగిరీలో భారత్ నుంచి ఈ మెగా ఈవెంట్లో 100 మంది వరకు అథ్లెట్లు పాల్గొననున్నారు.
మరో 25 మంది ఇంకా అర్హత సాధించే అవకాశం ఉంది. జూన్ చివరి నాటికి ఆ వివరాలు వెలువడుతాయి. రియో వేదికగా 2016లో జరిగిన పారాలింపిక్స్లో 19 మంది అథ్లెట్లు పాల్గొనగా.. ఈ సారి ఆ సంఖ్య 26కి పెరిగింది. మరో 16 మంది అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి.




