AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuortane Games 2022: ప్రపంచ ఛాంపియన్‌కు షాకిచ్చిన భారత స్టార్ అథ్లెట్.. బంగారు పతకం కైవసం..

ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ఏకైక భారత అథ్లెట్ నీరజ్ చోప్రా. నీరజ్ ఒలింపిక్స్ తర్వాత గత వారం తిరిగి వచ్చి, అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు.

Kuortane Games 2022: ప్రపంచ ఛాంపియన్‌కు షాకిచ్చిన భారత స్టార్ అథ్లెట్.. బంగారు పతకం కైవసం..
Neeraj Chopra
Venkata Chari
|

Updated on: Jun 19, 2022 | 6:52 AM

Share

టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) మరో ఫీట్‌ సాధించాడు. ఒలింపిక్స్ తర్వాత జరిగిన తొలి టోర్నీలో జాతీయ రికార్డు సృష్టించగా, రెండో టోర్నీలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫిన్‌లాండ్‌లో జరిగిన కుర్టానే గేమ్స్‌(Kuortane Games 2022)లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుని, తన స్టార్ ఫామ్‌ను కొనసాగించాడు. 86.89 మీటర్ల త్రో విసిరి స్వర్ణం సాధించాడు. కాగా, 90 మీటర్ల మార్కును సాధిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ, అది కుదరలేదు. చోప్రా అంతకుముందు గత వారం తుర్కులో 89 మీటర్ల రికార్డును సాధించాడు. పావో నూర్మి 30 మీటర్ల త్రోతో క్రీడల్లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అతను కేవలం 70 సెంటీమీటర్ల తేడాతో 90 మీటర్ల దూరాన్ని కోల్పోయాడు. ఫిన్‌లాండ్‌కు చెందిన ఒలివర్ హెల్లాండర్ 89. 83 మీటర్ల త్రోతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

తొలి ప్రయత్నంలోనే నీరజ్‌కి స్వర్ణం..

నీరజ్ తన తొలి ప్రయత్నంలోనే 86.89 మీటర్లు విసిరాడు. దీని తర్వాత, అతని తదుపరి ప్రయత్నం ఫౌల్, మూడవ ప్రయత్నంలో అతను జావెలిన్ విసురుతూ జారిపోయాడు. ఆ తర్వాత ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. అతనితో పాటు 2012 ఒలింపిక్ టొబాగోకు చెందిన కెషోర్న్ వాల్కాట్ 86.64 మీటర్లతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అదే సమయంలో, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ 84.75 మీటర్లతో కాంస్య పతకాన్ని మాత్రమే గెలుచుకోగలిగాడు. ఒలింపిక్ రజత పతక విజేత చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వాలేష్, ఐదో స్థానంలో ఉన్న జూలియన్ వెబర్ ఆడలేదు. గతేడాది ఇక్కడ 93.59 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించిన జర్మనీకి చెందిన జోహన్నెస్ వెటర్ పాల్గొనలేదు. చోప్రా గతేడాది 86. 79 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. నీరజ్ ఇప్పుడు జూన్ 30 నుంచి డైమండ్ లీగ్ స్టాక్‌హోమ్ దశలో పాల్గొంటాడు.

ఇవి కూడా చదవండి

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకమే లక్ష్యంగా..

ఈ ఏడాది జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించాలని చోప్రా లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఇలాగే చేస్తానని, పతకం గెలుస్తానో లేదో ఫలితం వస్తుందో చూద్దాం అని కొద్ది రోజుల క్రితం శిక్షణలో పేర్కొన్నాడు. గతేడాది ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించానని కాదు, ఈ ఏడాది కూడా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించాలి. భవిష్యత్తు కోసం నేను ఇంకేం చేయగలనో చేస్తాను. కొంత ఒత్తిడి ఉంటుంది, అది సహజమని ఆయన అన్నారు. కానీ, నేను ఎప్పుడూ రిలాక్స్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించను. పెద్ద టోర్నీలకు వెళ్లే ముందు నేను వీలైనంత సాధారణంగానే ఉంటాంటూ చెప్పుకొచ్చాడు.