Paralympics: దుమ్ములేపుతున్న భారత్ అథ్లెట్స్.. ఖాతాలోకి మరో గోల్డ్ మెడల్..

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Sep 05, 2021 | 11:08 AM

Krishna Nagar Gold Medal: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ అథ్లెట్స్ ఆదరగొడుతున్నారు. ఇదే కోవలో భారత్ ఖాతాలోకి మరో గోల్డ్ మెడల్ చేరింది. పురుషుల బ్యాడ్మింటన్‌లో కృష్ణ నాగర్ స్వరాన్ని గెలిచాడు.

Paralympics: దుమ్ములేపుతున్న భారత్ అథ్లెట్స్.. ఖాతాలోకి మరో గోల్డ్ మెడల్..
Krishna Nagar

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ అథ్లెట్స్ అదరగొడుతున్నారు. అసాధారణ రీతిలో ప్రదర్శనను కనబరుస్తూ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. తాజాగా పురుషుల బ్యాడ్మింటన్‌లో కృష్ణ నాగర్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్స్‌లో హాంకాంగ్ ఆటగాడు చుమన్‌పై 21-17, 16-21, 21-17 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుని స్వర్ణాన్ని ముద్దాడాడు. ఈరోజు మెగా క్రీడల్లో భారత్ రెండు పతకాలు సాధించింది. ఈ ఉదయం బ్యాడ్మింటన్ ఎస్ఎల్-4 సుహాస్ యతిరాజ్ రజతం సాధించగా..తాజాగా కృష్ణ నాగర్ గోల్డ్ మెడల్ సాధించాడు. దీనితో పారాలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్ 19 మెడల్స్ సాధించింది. వీటిల్లో 5 గోల్డ్, 8 రజతం, 6 కాంస్య పతకాలు ఉన్నాయి.

కాగా, బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్ 4 విభాగంలో భారత అథ్లెట్ సుహాస్.. రజత పతకాన్ని సాధించాడు.  పురుషుల సింగిల్స్‌లో… ఫ్రాన్స్ దేశానికి చెందిన లుకాస్ మజుర్‌తో తలపడిన సుహాస్ ఓటమిపాలయ్యాడు. 62 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో  21-15 17-21 15-21  తేడాతో ఓటమిపాలయ్యాడు. దీంతో రజతంతో సరిపెట్టుకున్నాడు సుహాస్.

Also Read: Mileage Bikes: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. అదిరిపోయే ఈ 5 బైకులపై ఓ లుక్కేయండి.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu