AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాల్దీవ్స్‌లో ఏమి హాయిలే హల!

ఐపీఎల్ 2019 సమరం ముగిసింది. ఐపీఎల్ చరిత్రలోనే నాలుగు సార్లు కప్‌ను సొంతం చేసుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్ అవతరించింది. టీంను ముందుండి నడిపించడంలో చెరిగిపోని ముద్ర వేశాడు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.  అంతేకాదు…నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి, ఐపీఎల్ ఛాంపియన్ జట్టులో ఐదుసార్లు సభ్యుడిగా ఉన్న ఏకైక క్రికెటర్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడు. రెండు నెలల పాటు మ్యాచులు, ప్రాక్టీస్ సెషన్స్‌తో యమ బిజీగా గడిపిన క్రికెటర్లు అందరూ ఇప్పుడు హాయిగా సేదతీరుతున్నాడు. […]

మాల్దీవ్స్‌లో ఏమి హాయిలే  హల!
Ram Naramaneni
|

Updated on: May 17, 2019 | 3:48 PM

Share

ఐపీఎల్ 2019 సమరం ముగిసింది. ఐపీఎల్ చరిత్రలోనే నాలుగు సార్లు కప్‌ను సొంతం చేసుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్ అవతరించింది. టీంను ముందుండి నడిపించడంలో చెరిగిపోని ముద్ర వేశాడు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.  అంతేకాదు…నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి, ఐపీఎల్ ఛాంపియన్ జట్టులో ఐదుసార్లు సభ్యుడిగా ఉన్న ఏకైక క్రికెటర్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడు. రెండు నెలల పాటు మ్యాచులు, ప్రాక్టీస్ సెషన్స్‌తో యమ బిజీగా గడిపిన క్రికెటర్లు అందరూ ఇప్పుడు హాయిగా సేదతీరుతున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన భార్య రితికా శర్మ, కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో వాలిపోయాడు.

ముంబై ఇండియన్స్ జట్టుకు 104 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహారించిన రోహిత్ శర్మ 60 విజయాలు అందించాడు.  మే 30 నుంచి ఇంగ్లండ్‌లో ప్రారంభమయ్యే వరల్డ్‌కప్‌కు భార్యలను మొదటి 2 వారాలు అనుమతించేది లేదంటూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేయడంతో భార్య రితికా శర్మ, కూతురు సమైరాలను మిస్ కాబోతున్నాడు రోహిత్ శర్మ.