AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA 3rd ODI : చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు.. భారత్ లక్ష్యం 271

IND vs SA 3rd ODI : భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన, విజేతను నిర్ణయించే మూడవ పోరు విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో హోరాహోరీగా జరిగింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవడంతో ఈ మూడో మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

IND vs SA  3rd ODI : చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు.. భారత్ లక్ష్యం 271
Ind Vs Sa 3rd Odi
Rakesh
|

Updated on: Dec 06, 2025 | 5:22 PM

Share

IND vs SA 3rd ODI : భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన, విజేతను నిర్ణయించే మూడవ పోరు విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో హోరాహోరీగా జరిగింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవడంతో ఈ మూడో మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత్ వరుసగా 20 వన్డేల్లో టాస్ ఓడిపోయిన చెత్త రికార్డుకు ముగింపు పలికి టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఓపెనర్ క్వింటన్ డి కాక్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఈ సిరీస్‌లో ఫామ్‌లో లేని డి కాక్, ఈ కీలక మ్యాచ్‌లో 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అతను 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. కెప్టెన్ టెంబా బావుమా (48 పరుగులు) తో కలిసి డి కాక్ 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. డి కాక్ సెంచరీతో జట్టు భారీ స్కోరు సాధిస్తుందని భావించినా, భారత బౌలర్లు చివరి ఓవర్లలో అద్భుతంగా రాణించారు.

ఈ మ్యాచ్‌లో భారత బౌలింగ్ విభాగం అద్భుతంగా సమష్టి ప్రదర్శన చేసింది. ముఖ్యంగా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించి చెరో 4 వికెట్లు తీశారు. ప్రసిద్ధ్ తన 29వ ఓవర్‌లో మాథ్యూ బ్రీట్జ్‌కే (LBW), గత మ్యాచ్ సెంచరీ హీరో ఐడెన్ మార్కరమ్లను అవుట్ చేసి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఆ తర్వాత డి కాక్ (106)ను కూడా అవుట్ చేసి సౌతాఫ్రికా వెన్ను విరిచాడు. స్పిన్నర్ కుల్దీప్ తన ఓవర్లలో డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బోష్, లుంగీ ఎన్గిడిలను అవుట్ చేసి మిడిల్, లోయర్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు.

అంతకుముందు అర్ష్‌దీప్ సింగ్ తొలి ఓవర్‌లోనే రయాన్ రికెల్టన్ను అవుట్ చేసి భారత్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. రవీంద్ర జడేజా కెప్టెన్ టెంబా బావుమా (48) ను అవుట్ చేయడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 47.5 ఓవర్లలో 270 పరుగులకు ముగిసింది.

సౌతాఫ్రికా జట్టును 270 పరుగులకే ఆలౌట్ చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి భారత్ ఇప్పుడు 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. టాస్ గెలవడం, బౌలింగ్‌లో మంచి ప్రదర్శన ఇవ్వడం భారత జట్టుకు సానుకూల అంశం. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ (సెంచరీల హ్యాట్రిక్‌), రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..