AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడేళ్లకే మా మధ్య చెడింది.. జుట్టుపీక్కునే రేంజ్‌లో గొడవలు.. షాకింగ్ విషయం చెప్పిన స్టార్ హీరోయిన్

సినీ సెలబ్రెటీల ప్రేమ వ్యవహారాలు, పెళ్లి, విడాకులు అనేవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొంతమంది పెళ్లి చేసుకుంటుంటే మరికొంతమంది విడాకులు తీసుకొని షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇచ్చారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది.

మూడేళ్లకే మా మధ్య చెడింది.. జుట్టుపీక్కునే రేంజ్‌లో గొడవలు.. షాకింగ్ విషయం చెప్పిన స్టార్ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Dec 06, 2025 | 4:54 PM

Share

సినిమా ఇండస్ట్రీలో రీసెంట్ గా ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి చాలా కామన్ అవుతున్నాయి. కొందరు విడాకులతో అభిమానులకు షాక్ ఇస్తుంటే మరికొంతమంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్నారు. ఇటీవలే సమంత రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సమంత పేరు మారుమ్రోగిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ముద్దుగుమ్మ తన భర్తతో రోజూ గొడవలు అంటూ షాక్ ఇచ్చింది.మూడేళ్లకే జుట్టుపీక్కునే రేంజ్ లో గొడవలు అంటూ అందరిని అవాక్ చేసింది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? మొన్నామద్యే ఈ అందాల భామ ప్రేమించి పెళ్లి చేసుకుంది. కట్ చేస్తే ఇప్పుడు ఈ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..?

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది.. సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

ఆమె ఎవరో కాదు సోనాక్షి సిన్హా.. బాలీవుడ్ అందాల భామ సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ చిన్నది. ఆతర్వాత అక్కడ వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సౌత్ లోనూ ఓ సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ రజినీకాంత్ హీరోగా నటించిన లింగ సినిమాలో సోనాక్షి హీరోయిన్ గా చేసింది. కాగా సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకుంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఆ మధ్య పెళ్లి పీటలు ఎక్కారు

ఇది కూడా చదవండి : నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్.. అదేంటంటే

ఇదిలా ఉంటే ఇటీవలే టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది సోనాక్షి సిన్హా.. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రేమలో ఉన్నప్పుడు మొదటి మూడేళ్లు మా మధ్య వివరీతమైన గొడవలు జరిగాయి. జుట్టుపీక్కునే రేంజ్ లో మా మధ్య గొడవలు జరిగాయి.. కానీ విడిపోవాలని అనుకోలేదు.. ఒకరి ఆలోచనలను మరొకరం అర్థం చేసుకోలేకపోయాం. ఆతర్వాత కపుల్స్‌ థెరపీకి వెళ్ళాం.. అప్పటి నుంచి మా మధ్య గొడవలు తగ్గాయి. ప్రతీది నెగిటివ్ గా చూడకూడదు అని అర్ధమైంది. అలా మేము ప్రేమలో కంటిన్యూ అయ్యాం.. చివరికి పెళ్లి చేసుకున్నాం అని చెప్పుకొచ్చింది సోనాక్షి.

ఇది కూడా చదవండి : సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో.. చాలా బాధపడ్డానన్న నేచురల్ బ్యూటీ

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .