Yash Dhull: రంజీల్లో దుమ్మురేపుతున్న యశ్​ధుల్.. ఫామ్​లోకి వచ్చిన రహానె, పుజారా..

భారత అండర్​-19 వరల్డ్​కప్ కెప్టెన్​గా అదరగొట్టి, జట్టును ఛాంపియన్​గా నిలబెట్టిన యశ్​ధుల్​.. రంజీల్లో కూడా దుమ్మురేపుతున్నాడు...

Yash Dhull: రంజీల్లో దుమ్మురేపుతున్న యశ్​ధుల్.. ఫామ్​లోకి వచ్చిన రహానె, పుజారా..
Yash Dhull
Follow us

|

Updated on: Feb 21, 2022 | 8:15 AM

భారత అండర్​-19 వరల్డ్​కప్ కెప్టెన్​గా అదరగొట్టి, జట్టును ఛాంపియన్​గా నిలబెట్టిన యశ్​ధుల్​.. రంజీల్లో కూడా దుమ్మురేపుతున్నాడు. తొలి మ్యాచ్​లోనే రెండు సెంచరీలు బాదాడు. తొలి ఇన్నింగ్స్​లో శతకం నమోదు చేసిన ధూల్​.. రెండో ఇన్నింగ్స్​లో కూడా మరో సెంచరీ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రంజీల్లో అరంగేట్రం మ్యాచ్​లోనే రెండు ఇన్నింగ్స్​లో రెండు శతకాలు బాదిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు ఈ ఘనత నారీ కాంట్రాక్టర్, విరాగ్​ అవతేల పేరిట ఉంది.

దిల్లీకి ఆడుతున్న ధుల్​.. తమిళనాడుతో మ్యాచ్​లోని రెండో ఇన్నింగ్స్​లో 200 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 13 బౌండరీలు ఉన్నాయి. అంతకుముందు తొలి ఇన్నింగ్స్​లో 113 పరుగులు చేశాడు. టీమ్​ఇండియా టెస్టు జట్టులో స్థానం కోల్పోయి బీసీసీఐ వేటుకు గురైన రహానె-పుజారా ద్వయం మళ్లీ రంజీ మ్యాచ్​లతో ఫామ్​ అందుకుంది.

సౌరాష్ట్రతో మ్యాచ్​లో సెంచరీ బాదిన రహానె ఫామ్​లోకి వచ్చాడు. మరోవైపు పుజారా.. తొలిఇన్నింగ్స్​లో డకౌట్​ అయినా రెండో ఇన్నింగ్స్​ నిలకడగా ఆడి 83 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఇందులో 16 ఫోర్లు, ఓ సిక్సర్​ ఉన్నాయి. ఈసారి రంజీ ట్రోఫీని రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10న ప్రారంభమైన ఈ టోర్నీ తొలి దశ మార్చి 15 వరకు కొనసాగుతుంది. ఐపీఎల్​ పూర్తయ్యాక మే 30 నుంచి జూన్​ 26 వరకు రెండో దశ టోర్నీ జరుగుతుంది.

Read Also.. IND vs SL: రంజీలో పరుగులు, వికెట్లు తీస్తేనే జట్టులోకి రీఎంట్రీ.. నలుగురు సీనియర్‌ ప్లేయర్లకు సెలక్టర్ల సందేశం..