AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: రంజీలో పరుగులు, వికెట్లు తీస్తేనే జట్టులోకి రీఎంట్రీ.. నలుగురు సీనియర్‌ ప్లేయర్లకు సెలక్టర్ల సందేశం..

Indian Cricket Team: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఇందులో నలుగురు సీనియర్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు.

IND vs SL: రంజీలో పరుగులు, వికెట్లు తీస్తేనే జట్టులోకి రీఎంట్రీ.. నలుగురు సీనియర్‌ ప్లేయర్లకు సెలక్టర్ల సందేశం..
Ind Vs Sl
Venkata Chari
|

Updated on: Feb 20, 2022 | 8:50 AM

Share

శ్రీలంక(Sri Lanka)తో మార్చి మొదటి వారంలో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌కు టీమిండియా(Team India)ను ప్రకటించారు. సెలక్టర్లు 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. జట్టు కమాండ్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు అప్పగించారు. అదే సమయంలో, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా వంటి వెటరన్‌లను జట్టు నుంచి తప్పించారు. ఈ నలుగురు ఆటగాళ్లను రాబోయే టెస్టు సిరీస్‌కి దూరంగా ఉంచడంతోపాటు సెలక్టర్లు స్పష్టమైన సందేశం ఇచ్చారు. రంజీ ట్రోఫీలో పరుగులు చేయడం, వికెట్లు తీయడం ద్వారా మళ్లీ జాతీయ జట్టులో భాగస్వామ్యాన్ని పొందవచ్చంటూ సూచనలిచ్చారు.

సెలెక్టర్ చేతన్ శర్మ ఏం చెప్పాడు? ఈ నలుగురు సీనియర్ ఆటగాళ్లను దూరంగా ఉంచడంపై నేషనల్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ మాట్లాడుతూ, ‘చాలా ఆలోచించిన తర్వాతే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. సౌతాఫ్రికా సిరీస్ తర్వాతే ఈ ఆటగాళ్లతో మాట్లాడాం. శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో మిమ్మల్ని ఎంచుకోబోమని తేల్చి చెప్పాం. అయితే వారికి తలుపులు పూర్తిగా తెరిచి ఉన్నాయి. సమస్య ఎక్కడా లేదు. వెళ్లి రంజీ మ్యాచ్‌లు ఆడమని చెప్పాం’అంటూ చెప్పుకొచ్చారు.

చేతన్ శర్మ మాట్లాడుతూ, ‘ఎవరి కోసం అయినా తలుపులు మూసివేసేందుకు మేం ఎవరం. ఇది క్రికెట్ ఆట. పరుగులు చేయాలి. వికెట్లు తీయాలి. ఆ తర్వాతే దేశం తరపున ఆడొచ్చు. ఇది ఎంపికకు ప్రధాన ఆధారం. నలుగురు ఆటగాళ్లను రంజీ ట్రోఫీ ఆడాలని అభ్యర్థించాను. ఇంతమంది అక్కడికి వెళ్లి ప్రదర్శన ఇస్తే బాగుంటుందని అనుకున్నాం’ అని పేర్కొన్నాడు.

రహానే, పుజారా, సాహా, ఇషాంత్ చాలా కాలంగా ఫామ్‌లో లేరు.. గత రెండేళ్లలో రహానే ఒక్క సెంచరీ మాత్రమే చేయగా.. పుజారా ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ సమయంలో, ఈ ఆటగాళ్ల పరుగుల సగటు కూడా 20 నుంచి 30 మధ్య ఉంది. మరోవైపు ఫాస్ట్ బౌలింగ్, వికెట్ కీపింగ్‌లో టీమిండియాకు అనేక ఎంపికలు ఉన్నాయి. వికెట్ కీపింగ్‌లో రిషబ్ పంత్ ఉత్తమ అభ్యర్థి అయితే, అతనికి ప్రత్యామ్నాయంగా కేఎస్ భరత్‌ని చూస్తున్నారు. ఫాస్ట్ బౌలింగ్‌లోనూ భారత్‌కు షమీ, భువనేశ్వర్, సిరాజ్ నుంచి శార్దూల్, బుమ్రా వంటి బౌలర్లు ఉన్నారు.

Also Read: Ipl 2022 Auction: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు కొత్త అసిస్టెంట్‌ కోచ్‌.. సైమన్‌ కటిచ్‌ స్థానంలో ఎవరు రానున్నారంటే..

దోషిగా తేలితే ఆ ప్లేయర్‌ IPL కాంట్రాక్ట్ రద్దవుతుందా.. క్రికెట్‌ ఆడకుండా నిషేధిస్తారా..?

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..