AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Elections: తొలిసారి ఎంపీగా పోటీ.. కట్‌చేస్తే.. కాంగ్రెస్ సీనియర్ నేతపై భారీ మెజార్టీతో పార్లమెంట్‌కు టీమిండియా క్రికెటర్..

Lok Sabha Election Results 2024: క్రికెటర్ యూసుఫ్ పఠాన్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో బహరంపూర్ స్థానం నుంచి గెలుపొందారు. తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ) తరపున ఎన్నికల్లో పోటీ చేసిన యూసఫ్ పఠాన్ కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరిని ఓడించారు. యూసుఫ్ పఠాన్ 2007, 2011లో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్ విజేత రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లలో కూడా యూసుఫ్ సభ్యుడిగా ఉన్నాడు.

Lok Sabha Elections: తొలిసారి ఎంపీగా పోటీ.. కట్‌చేస్తే.. కాంగ్రెస్ సీనియర్ నేతపై భారీ మెజార్టీతో పార్లమెంట్‌కు టీమిండియా క్రికెటర్..
Yusuf Pathan
Venkata Chari
|

Updated on: Jun 04, 2024 | 5:26 PM

Share

Lok Sabha Election Results 2024: క్రికెటర్ యూసుఫ్ పఠాన్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో బహరంపూర్ స్థానం నుంచి గెలుపొందారు. తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ) తరపున ఎన్నికల్లో పోటీ చేసిన యూసఫ్ పఠాన్ కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరిని ఓడించారు. యూసుఫ్ పఠాన్ 2007, 2011లో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్ విజేత రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లలో కూడా యూసుఫ్ సభ్యుడిగా ఉన్నాడు.

41 ఏళ్ల యూసుఫ్ పఠాన్ బహరంపూర్ స్థానం నుంచి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, బీజేపీ నేత నిర్మల్ కుమార్ సాహా నుంచి పోటీ చేశారు. యూసుఫ్ పఠాన్‌కు 4,08,240 ఓట్లు వచ్చాయి. గత లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న అధిర్ రంజన్ చౌదరిపై ఆయన 59,351 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అధీర్ రంజన్ చౌదరికి 3,48,889 ఓట్లు వచ్చాయి. బీజేపీ నేత దాదాపు 3,12,876 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడితే, 240 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే పూర్తి మెజారిటీకి చేరువలో ఉంది. కాంగ్రెస్ దాదాపు 95 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి దాదాపు 230 సీట్లు గెలుచుకోగలదు.

లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చాలా మంది క్రికెటర్లు ఇప్పటికే పార్లమెంటుకు చేరుకున్నారు. వీరిలో గౌతమ్ గంభీర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మహమ్మద్ అజారుద్దీన్, కీర్తి ఆజాద్, చేతన్ చౌహాన్ ఉన్నారు. గంభీర్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..