AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virender Sehwag: విరూ భాయ్ నుంచి అద్దిరిపోయే పోస్ట్.. ఆ ప్రత్యేకమైన బ్యాట్‌లకు ‘ప్యారే సాథీ’ అంటూ..

Virender Sehwag: భారత క్రికెెట్ చరిత్రలో అత్యుత్తమైన ఓపెనర్లలో వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఒకరు. ఎన్నో మ్యాచ్‌ల్లో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ ఆట అంటే అభిమానులకు కన్నుల విందే. ఫార్మాట్ ఏదైనా ఎదురెళ్లి మరీ బంతికి డాష్ ఇవ్వడం సెహ్వాగ్‌..

Virender Sehwag: విరూ భాయ్ నుంచి అద్దిరిపోయే పోస్ట్.. ఆ ప్రత్యేకమైన బ్యాట్‌లకు ‘ప్యారే సాథీ’ అంటూ..
Virender Sehwag
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 29, 2023 | 2:34 PM

Share

Virender Sehwag: భారత క్రికెెట్ చరిత్రలో అత్యుత్తమైన ఓపెనర్లలో వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఒకరు. ఎన్నో మ్యాచ్‌ల్లో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ ఆట అంటే అభిమానులకు కన్నుల విందే. ఫార్మాట్ ఏదైనా ఎదురెళ్లి మరీ బంతికి డాష్ ఇవ్వడం సెహ్వాగ్‌ ప్రత్యేకత. ఇక క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత సోషల్ మీడియాలా చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నాడు వీరూ. ఈ క్రమంలోనే సెహ్వాగ్ ఎప్పుడూ క్రికెట్, సమకాలీన పరిస్థితులపై స్పందిస్తుంటాడు. తాజాగా ఈ మాజీ క్రికెటర్‌కి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసుకుని మరీ ఇతర సోషల్ మీడియా వేదికల్లో కూడా ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ పోస్ట్‌కి ఉన్న ప్రత్యేకత అలాంటిది మరి. అసలు సెహ్వాగ్ పోస్ట్ చేసిన ఆ పోస్ట్‌లో ఏముంది..? తెలుసుకుందాం..

సెహ్వాగ్ తన టెస్ట్ కెరీర్‌లో భారత్ తరఫున 2 త్రిబుల్ సెంచరీలు సహా మొత్తం 6 టెస్ట్ డబుల్  శతకాలు బాదాడు. అలాగే వన్డేల్లో కూడా ఓ డబుల్ సెంచరీ చేశాడు. ఇలాంటి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ల్లో తాను ఉపయోగించిన బ్యాట్‌లకు సంబంధించిన ఫోటోను వీరూ నెటింట పోస్ట్ చేశాడు. ‘బ్యాట్‌ల్లో సత్తా ఉంది- 309, 319, 219, 119, 254. ప్రియమైన సహచరులు. లొస్ట్ 293 వాలా’ అని అర్థం వచ్చే క్యాప్షన్‌తో ఆ పిక్‌ని సెహ్వాగ్ షేర్ చేయగా.. అది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే సెహ్వాగ్ తన పోస్ట్‌లో పేర్కొన్న 309 పరుగులు పాకిస్థాన్‌పై 2004 లో చేశాడు. అలాగే దక్షిణాఫ్రికాపై 319, విండీస్‌పై 219, పాకిస్థాన్‌పైనే 254 పరుగులు చేసిన ఇన్సింగ్స్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా, సెహ్వాగ్ చివరిగా ప్రస్తావించిన 293 పరుగుల ఇన్నింగ్స్ 2009లో శ్రీలంకపై ఆడింది. ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్ మరో 7 పరుగులు చేస్తే త్రిపుల్ సెంచరీ పూర్తవుతుందన్న సమయంలో ముత్తయ్య మురళీధరణ్ వేసిన ఓవర్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంకా తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సెహ్వాగ్ షేర్ చేసిన పోస్ట్‌కి నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. ‘మీరు బెస్ట్ క్రికెటర్ కాదు, క్రికెట్ బీస్ట్’.., ‘విధ్వంసకర ఆయుధాలు’.., ‘మీలాంటి ప్లేయర్ టీమిండియాకు లభించడం చాలా కష్టం’ అంటూ పలువురు నెటిజన్లు రాసుకొచ్చారు.

శ్రీలంకపై వీరూ భాయ్ 293 ఇన్నింగ్స్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?