AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వచ్చేస్తున్నాడు అసలైన కింగ్.. ఇంగ్లాండ్ ఇక కాచుకోండి.. ఇచ్చిపడేసిన టీమిండియా మాజీ కోచ్..!

Sanjay Bangar Comments on Virat Kohli: ఇప్పటికే శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని వన్డే జట్టు సభ్యులు ఇంగ్లాండ్ చేరుకోగా, మిగిలిన ఆటగాళ్లు నేటి ఆఖరి టీ20 మ్యాచ్ ముగిసిన వెంటనే వన్డే జట్టుతో కలవనున్నారు. టీ20 సిరీస్ కోల్పోయిన కసితో ఉన్న భారత్, విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్, సంజయ్ బంగార్ అందించిన ప్రత్యేక శిక్షణ సాయంతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని ఇంగ్లాండ్‌కు గట్టి సమాధానం ఇస్తుందని ఆశిద్దాం.

వచ్చేస్తున్నాడు అసలైన కింగ్.. ఇంగ్లాండ్ ఇక కాచుకోండి.. ఇచ్చిపడేసిన టీమిండియా మాజీ కోచ్..!
England Vs India Odi Series
Venkata Chari
|

Updated on: Jul 11, 2026 | 7:52 AM

Share

Virat Kohli ODI Series vs England: భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎంతటి పటిష్టమైన వన్డే జట్టును సిద్ధం చేసినప్పటికీ, విదేశీ గడ్డపై జరిగే మ్యాచ్‌లు ఎప్పుడూ సవాలుతో కూడుకున్నవే. ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్చులపై బంతి స్వింగ్ అయ్యే తీరు బ్యాటర్లను తీవ్రంగా పరీక్షిస్తుంది. ప్రస్తుతం భారత టీ20 జట్టు అక్కడ వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో, అందరి కళ్లు ఇప్పుడు రాబోయే వన్డే సిరీస్‌పైనే ఉన్నాయి. ఈ క్రమంలోనే టీం ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రత్యేక వ్యూహంతో సిద్ధమయ్యాడో మాజీ కోచ్ సంజయ్ బంగార్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

టీ20 సిరీస్ చేజారిన వేళ.. వన్డేలపైనే భారత్ ఆశలు!

ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత యువ జట్టు ప్రదర్శన తీవ్ర నిరాశను మిగిల్చింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను పూర్తిగా చేజార్చుకుంది. ఐర్లాండ్ పర్యటనతో పాటు ఇక్కడ కూడా వరుసగా రెండో సిరీస్ ఓటమిని చవిచూడటంతో క్రీడాభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: వద్దని చెప్పినా అంటగట్టేశారు.. అతని వల్లే సిరీస్ కోల్పోయాం.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్..

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో, ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ టీం ఇండియాకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ వన్డే సమరంలో ఇంగ్లాండ్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి, టీ20 పరాజయానికి బదులు తీర్చుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.

రోహిత్-విరాట్ జోడి రాకతో పెరిగిన బలం!

యువ ఆటగాళ్లతో తడబడిన భారత జట్టుకు సీనియర్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాక కొండంత బలాన్ని ఇస్తోంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ చేరుకోగా, ప్రస్తుతం అక్కడే తన కుటుంబంతో కలిసి సమయం గడుపుతున్న విరాట్ కోహ్లీ తొలి వన్డే కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

గతంలో కెరీర్ ఆరంభంలో ఇంగ్లాండ్ పిచ్చులపై విరాట్ కోహ్లీకి అంత గొప్ప రికార్డులు లేవు. కానీ ఆ తర్వాత తన లోపాలను సరిదిద్దుకుని పరుగుల వరద పారించాడు. ఇప్పుడు మరోసారి ఇంగ్లాండ్ గడ్డపై తన విశ్వరూపం చూపించడానికి కింగ్ కోహ్లీ పక్కా ప్రణాళికతో సన్నద్ధమవుతున్నాడు.

స్వింగ్ బంతులను ఎదుర్కొనేలా కోహ్లీ ప్రత్యేక సాధన..!

విరాట్ కోహ్లీ ఆఖరి నిమిషం వరకు ఎంత కఠోరంగా శ్రమిస్తాడో తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ వివరించారు. ఇంగ్లాండ్ వాతావరణంలో రాణించాలంటే ప్రధానంగా రెండు విషయాలను గుర్తుపెట్టుకోవాలని ఆయన పేర్కొన్నారు. అక్కడ బంతి వేగంగా స్వింగ్ అవుతుంది కాబట్టి, దానిని ఎంత ఆలస్యంగా (లేట్‌గా) ఆడితే అంత మంచిదని చెప్పారు.

ఇది కూడా చదవండి: ఆ చెత్త ప్లేయర్.. ఇలాగే ఛాన్స్‌లిస్తే జింబాబ్వేపైనా మీరు గెలవలేరు గంభీర్..!

ఇందుకోసం కోహ్లీ తనతో కలిసి ప్రత్యేకంగా నెట్స్‌లో సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేశాడని బంగార్ వెల్లడించారు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో విఫలమైనప్పుడు, కోహ్లీ భారత్‌లోనే అదే తరహా పిచ్చులను సిద్ధం చేసుకుని మరీ కం బ్యాక్ ఇచ్చాడని, ఈసారి కూడా అతని సాధన తీవ్రతలో ఎలాంటి మార్పు లేదని కొనియాడారు. ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టేందుకు కోహ్లీ పూర్తి వ్యూహంతో బరిలోకి దిగుతున్నాడని స్పష్టం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us