AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: ఎంఎస్‌ ధోనిని గుర్తుచేసిన విరాట్ కోహ్లీ.. హెలికాప్టర్‌ షాట్‌తో భారీ సిక్స్‌.. వైరల్‌ వీడియో

ఈ మ్యాచ్‌లో ఒక షాట్‌తో మిస్టర్ కూల్‌ ఎంఎస్‌ ధోనిని గుర్తు చేశాడు కోహ్లీ. ఇన్నింగ్స్‌ 44వ ఓవర్ నాలుగో బంతికి లాంగ్ ఆన్ మీద అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. ఈ షాట్ ఎంఎస్ ధోనీని గుర్తు చేసింది. రజిత వేసిన బంతిని ధోని స్టైల్‌లో హెలికాప్టర్ షాట్ ఆడాడు కోహ్లీ. దీంతో బంతి నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లిపోయింది.

IND vs SL: ఎంఎస్‌ ధోనిని గుర్తుచేసిన విరాట్ కోహ్లీ.. హెలికాప్టర్‌ షాట్‌తో భారీ సిక్స్‌.. వైరల్‌ వీడియో
Basha Shek
|

Updated on: Jan 15, 2023 | 9:13 PM

Share

శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. శ్రీలంక బౌలర్లను భీకరంగా చిత్తు చేశాడు. 110 బంతుల్లో 166 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అతని అంతర్జాతీయ కెరీర్‌లో ఇది 74వ సెంచరీ కాగా వన్డేల్లో 46వది. ఇక ఈ సిరీస్‌లో రెండో సెంచరీ కాగా గత 4 వన్డేల్లో మూడో సెంచరీ కావడం మరో విశేషం. అంతకుముందు బంగ్లాతో జరిగిన చివరి వన్డేలోనూ విరాట్ సెంచరీ బాదాడు. కాగా ఈ మ్యాచ్‌లో 85 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ ఆతర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీలకు తరలించాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఒక షాట్‌తో మిస్టర్ కూల్‌ ఎంఎస్‌ ధోనిని గుర్తు చేశాడు కోహ్లీ. ఇన్నింగ్స్‌ 44వ ఓవర్ నాలుగో బంతికి లాంగ్ ఆన్ మీద అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. ఈ షాట్ ఎంఎస్ ధోనీని గుర్తు చేసింది. రజిత వేసిన బంతిని ధోని స్టైల్‌లో హెలికాప్టర్ షాట్ ఆడాడు కోహ్లీ. దీంతో బంతి నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గౌతమ్ గంభీర్ కూడా అతని షాట్‌ను మెచ్చుకున్నాడు. కోహ్లి సెంచరీ కంటే అతని సిక్స్ అద్భుతమని పొగిడాడు. ఇక సెంచరీ చేసిన తర్వాత విరాట్‌ మరింత దూకుడు పెంచాడు. 100 పరుగులు పూర్తి చేసిన తర్వాత అతను ఏకంగా 7 సిక్సర్లు కొట్టడం విశేషం.

కాగా కోహ్లి శ్రీలంకపై వన్డేల్లో 10వ సెంచరీని కూడా సాధించాడు. ఏ జట్టుపైనైనా వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు ఇదే. అంతేకాదు స్వదేశంలో వన్డేల్లో అత్యధికంగా 21 సెంచరీలు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. సచిన్ భారత్‌లో సాధించిన 20 వన్డే సెంచరీల రికార్డును కోహ్లీ తుడిచేశాడు. కాగా కోహ్లి అజేయ ఇన్నింగ్స్‌తో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక జట్టు 73 పరుగులకే కుప్పకూలింది. కోహ్లీతో పాటు భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా వన్డేల్లో రెండో సెంచరీ సాధించాడు. అతను 116 పరుగుల చేశాడు. రెండు సెంచరీలతో సిరీస్‌ ఆద్యంతం రాణించిన విరాట్ కోహ్లీకే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!