AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎవరికీ సాధ్యం కాని ఘనత అందుకున్న కోహ్లీ..

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య డ్రాగా ముగిసిన నాలుగో టెస్ట్‌‌లో.. 186 పరుగులు చేసిన కింగ్ కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దీంతో కోహ్లీ

Virat Kohli: క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎవరికీ సాధ్యం కాని ఘనత అందుకున్న కోహ్లీ..
Virat Kohli
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 14, 2023 | 9:01 PM

Share

ప్రపంచ క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ సహా ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని ఘనతను విరాట్ కోహ్లీ తన సొంతం చేసుకున్నాడు. అవును, బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య డ్రాగా ముగిసిన నాలుగో టెస్ట్‌‌లో.. 186 పరుగులు చేసిన కింగ్ కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దీంతో కోహ్లీ ప్రపంచ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలోనూ కనీసం 10 మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఒకే ఒక్క క్రికెటర్‌గా అవతరించాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందిన కోహ్లీకి ఇది ఈ ఫార్మాట్‌లో 10వ అవార్డు. దీంతో కోహ్లీ ఖాతాలోకి 10 ప్లేయర్ ఆఫ్ ది టెస్టు మ్యాచ్ అవార్డ్స్, 15 మ్యాన్ ఆఫ్ ది టీ20 మ్యాచ్ అవార్డులు, 38 మ్యాన్ ఆఫ్ ది వన్డే మ్యాచ్ అవార్డులు చేరాయి. ఇక ఈ ఘనత కోహ్లీ మినహా ఏ క్రికెటర్ కూడా సాధించలేదు. సాధించేందుకు దగ్గరిలో కూడా ఎవరూ లేరు.

అయితే భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్ట్‌‌ ఐదు రోజుల పాటు సాగింది. చివరి రోజు కూడా ఫలితం రాదని స్పష్టం అవడంతో డ్రాకు ఇరు జట్ల సారథులు అంగకరించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 480 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 571 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ టెస్టులో ఈ టెస్టులో ఆసీస్ తరఫున ఉస్మాన్ ఖవాజా(180), కామెరూన్ గ్రీన్(114) సెంచరీలు సాధించగా.. భారత్ తరఫున కూడా శుభమాన్ గిల్(128), కింగ్ కోహ్లీ(186) శతకాలతో రాణించారు.

నాలుగో మ్యాచ్‌ డ్రాగా ముగిసినప్పటికీ.. నాలుగు టెస్టుల బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీని టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. తొలి రెండు టెస్టుల్లో భారత్‌ విజయం సాధించగా.. మూడో టెస్టును ఆసీస్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇది వరుసగా నాలుగో టెస్ట్ సిరీస్‌ విజయం. అలాగే సొంతగడ్డపై టీమిండియాకు ఇది వరుసగా 16వ టెస్టు సిరీస్‌ విజయం. మరోవైపు టీమిండియాకు వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌‌కు చేరుకుంది. టీమిండియా కంటే ముందే ఫైనల్ చేరుకున్న ఆస్ట్రేలియాతో టెస్ట్ చాంపియన్‌షిప్ కోసం భారత్‌ ఈ ఏడాది జూన్‌ 7న లండన్‌లో తలపడనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ