AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : మహాశివరాత్రి నాడు మహా యుద్ధం..టీమిండియా గెలవాలని ఉజ్జయినిలో ప్రత్యేక పూజలు

IND vs PAK : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న హై-వోల్టేజ్ పోరులో టీమిండియా ఘనవిజయం సాధించాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం ఉజ్జయినిలో ఒక అద్భుతమైన సన్నివేశం చోటుచేసుకుంది.

IND vs PAK : మహాశివరాత్రి నాడు మహా యుద్ధం..టీమిండియా గెలవాలని  ఉజ్జయినిలో ప్రత్యేక పూజలు
India Vs Pakistan
Rakesh
|

Updated on: Feb 15, 2026 | 1:10 PM

Share

IND vs PAK : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న హై-వోల్టేజ్ పోరులో టీమిండియా ఘనవిజయం సాధించాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం ఉజ్జయినిలో ఒక అద్భుతమైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రపంచ ప్రసిద్ధ శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో టీమిండియా గెలవాలని కోరుకుంటూ భక్తులు, క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు కేవలం భారత్-పాక్ మ్యాచ్ మాత్రమే కాదు, పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం కూడా కావడంతో ఈ పూజలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

మహాశివరాత్రి సందర్భంగా మహాకాళేశ్వర ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు బాబా మహాకాళుడిని దర్శించుకునేందుకు బారులుదీరారు. ఈ పవిత్ర ఘడియల్లో క్రికెట్ అభిమానులు తమ అభిమాన జట్టు టీమిండియా గెలవాలని కోరుకుంటూ స్వామివారికి జలాభిషేకం చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమం జరిగింది. గర్భాలయం సమీపంలో టీమిండియా ఆటగాళ్ల పోస్టర్లు పట్టుకుని, జాతీయ జెండాను ఊపుతూ భక్తులు చేసిన సందడి చూస్తుంటే క్రికెట్ పట్ల భారతీయులకు ఉన్న మక్కువ అర్థమవుతోంది. జై భారత్, జై మహాకాల్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది.

ఆన్ పేపర్ భారత్ ఎంత బలంగా ఉన్నా, పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ఆటగాళ్లపై ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య ప్రతిష్టాత్మక పోరు. అందుకే ఈ మ్యాచ్‌లో భారత్ ఎలాంటి పొరపాట్లు చేయకుండా, అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి విజేతగా నిలవాలని భక్తులు బాబా మహాకాళుడిని వేడుకున్నారు. ఈరోజు మహాశివరాత్రి కావడం మా అదృష్టం. శివయ్య ఆశీస్సులు ఉంటే టీమిండియాను ఎవరూ ఆపలేరు. రోహిత్ శర్మ సేన పాకిస్థాన్‌ను ఓడించి తీరుతుందని పూజలో పాల్గొన్న ఒక అభిమాని ధీమా వ్యక్తం చేశారు.

కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, అందుకు ముందే ఉజ్జయినిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పవిత్ర భస్మ హారతి సమయంలోనూ చాలా మంది భక్తులు టీమిండియా విజయం కోసం మనసులో ప్రార్థించారు. ముఖ్యంగా బౌలర్లు రాణించాలని, బ్యాటర్లు భారీ స్కోర్లు సాధించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. భారత్-పాక్ మ్యాచ్ జరిగిన ప్రతిసారీ ఉజ్జయినిలో ఇలాంటి వేడుకలు జరగడం ఆనవాయితీగా వస్తోంది, కానీ ఈసారి శివరాత్రి తోడవ్వడంతో ఆ జోష్ రెట్టింపు అయింది.

ఈ ఏడాది శివరాత్రి ఉత్సవాల్లో క్రికెట్ ఒక భాగమైపోయింది. ఆలయానికి వచ్చే భక్తులు శివనామ స్మరణతో పాటు టీమిండియా విజయం గురించి చర్చించుకోవడం విశేషం. ఉజ్జయినితో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా హవనాలు, యజ్ఞాలు జరుగుతున్నాయి. గతంలో కూడా టీమ్ ఇండియా కీలక మ్యాచులకు ముందు ఇలాంటి పూజలు జరగడం, భారత్ విజయం సాధించడం చూశాం. ఈసారి కూడా బాబా మహాకాళుడి ఆశీస్సులతో టీమిండియా పాకిస్థాన్‌పై జయకేతనం ఎగురవేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి