AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India squad T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు ఇదే.. ధోని శిష్యుడికి లక్కీ ఛాన్స్..

అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. ఈ మేరకు నేడు బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. ఈమేరకు జట్టుకు సంబంధించి కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. జూన్ 1 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా, జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

India squad T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు ఇదే.. ధోని శిష్యుడికి లక్కీ ఛాన్స్..
Team India
Venkata Chari
|

Updated on: Apr 30, 2024 | 4:08 PM

Share

India squad T20 World Cup 2024: అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. ఈ మేరకు నేడు బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. ఈమేరకు జట్టుకు సంబంధించి కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. జూన్ 1 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా, జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

15 మంది సభ్యులతో కూడిన టీమ్‌లో చాలా మంది పేర్లు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు జట్టులో అవకాశం లభించింది. అదే సమయంలో గాయంతో దాదాపు ఏడాదిన్నర పాటు టీమిండియాకు దూరమైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ తిరిగి వచ్చాడు. అదే సమయంలో, బ్యాకప్ వికెట్ కీపర్‌గా చోటు సంపాదించడంలో సంజూ శాంసన్ విజయం సాధించాడు.

ఇవి కూడా చదవండి

జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.

రిజర్వ్‌లు – శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.

2024 పురుషుల T20 ప్రపంచ కప్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్‌లోని ఐసెన్‌హోవర్ పార్క్‌లో షెడ్యూల్ చేశారు. భారత్ గ్రూప్ దశ ప్రయాణం న్యూయార్క్‌లో మూడు మ్యాచ్‌లతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫ్లోరిడాలో నాల్గవ మ్యాచ్ జరుగుతుంది.

2022లో మెల్‌బోర్న్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది.

T20 ప్రపంచ కప్ 2024 గ్రూపులు..

గ్రూప్ A: ఇండియా, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్‌ఏ

గ్రూప్ బి: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్

గ్రూప్ సి: న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పాపువా న్యూ గినియా

గ్రూప్ డి: దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..