AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch : సెక్యూరిటీ లేకుండానే రోడ్లపైకి వచ్చిన హిట్ మ్యాన్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్

Watch : టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ తర్వాత ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు ముందు బర్మింగ్‌హామ్ వీధుల్లో విహరించిన రోహిత్ శర్మను చూసి అభిమానులు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. టీ20 సిరీస్ ఓటమి తర్వాత వన్డేల్లో పుంజుకోవాలని టీమిండియా పట్టుదలతో సిద్ధమవుతోంది.

Watch : సెక్యూరిటీ లేకుండానే రోడ్లపైకి వచ్చిన హిట్ మ్యాన్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్
Rohit Sharma
Rakesh
|

Updated on: Jul 13, 2026 | 3:32 PM

Share

Watch : ఇంగ్లాండ్‌తో జూలై 14 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు కాస్త సేదతీరారు. సుదీర్ఘమైన మ్యాచ్‌లు, ప్రాక్టీస్ సెషన్ల ఒత్తిడి నుంచి కాస్త బ్రేక్ తీసుకుని మైండ్ రీఫ్రెష్ చేసుకోవడానికి ఆటగాళ్లు బర్మింగ్‌హామ్ వీధుల్లో విహారానికి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ విహారయాత్రలో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను చూసిన వెంటనే బర్మింగ్‌హామ్ వీధులు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. తమ అభిమాన క్రికెటర్‌ను నేరుగా చూసే సరికి అక్కడ స్థానికంగా ఉన్న భారతీయ, విదేశీ అభిమానులు భారీ సంఖ్యలో గుమిగూడారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. భారత ఆటగాళ్లు ఎలాంటి అదనపు సెక్యూరిటీ హడావుడి లేకుండా చాలా సాధారణంగా బర్మింగ్‌హామ్ రోడ్లపై నడుస్తూ కనిపించారు. ఈ టూర్‌లో జట్టులోని అందరూ ఆటగాళ్లు కనిపించనప్పటికీ, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లు సందడి చేశారు. ఎటువంటి భద్రతా వలయం లేకపోవడంతో అభిమానులు నేరుగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వద్దకు దూసుకొచ్చారు. ఆయనతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఒకరినొకరు నెట్టుకుంటూ ఎగబడటంతో అక్కడ కాసేపు సందడి వాతావరణం నెలకొంది. రోహిత్ కూడా ఎంతో ఓపికగా అభిమానులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు.

ఈ వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా క్లీన్ స్వీప్ అయిన తర్వాత, ఈ వన్డే సిరీస్ భారతదేశానికి అత్యంత కీలకంగా మారింది. ఇంగ్లాండ్ గడ్డపై మళ్లీ పుంజుకుని పరువు నిలబెట్టుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ సిరీస్ పర్సనల్ మైల్‌స్టోన్స్ పరంగా కూడా ఎంతో ముఖ్యం. ఇంగ్లాండ్ దేశంలో వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఓపెనర్‌గా సరికొత్త రికార్డు సృష్టించే సువర్ణావకాశం ఇప్పుడు రోహిత్ శర్మ ముందుంది.

భారత బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబేలకు ఈ వన్డే సిరీస్ ఒక రకంగా అగ్నిపరీక్ష లాంటిదే. ఎందుకంటే దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ చేతిలో భారత్ టీ20 సిరీస్ ఓడిపోవడంలో వీరు కూడా భాగమయ్యారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోనే ఈ ఘోర పరాజయం జరగడం అతనికి వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బ. అయితే, గతాన్ని మర్చిపోయి వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా టీ20 సిరీస్ ఓటమి బాధను, అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చే అవకాశం ఈ ఆటగాళ్లకు దక్కింది. జూలై 14న జరిగే మొదటి వన్డేలో టీమిండియా ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతుందో చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us