AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shikhar Dhawan: కుక్క తోక ఎప్పుడూ వంకరే.. కాల్పుల విరమణపై పాక్‌ను ఏకిపారేసిన టీమిండియా మాజీ క్రికెటర్లు..

IND vs PAK: భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై గబ్బర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు, ఆయన 'ఆపరేషన్ సింధూర్'ను ప్రశంసిస్తూ స్పందించారు. శిఖర్ ధావన్‌తోపాటు టీం ఇండియాలోని ఇతర ఆటగాళ్లు కూడా శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Shikhar Dhawan: కుక్క తోక ఎప్పుడూ వంకరే.. కాల్పుల విరమణపై పాక్‌ను ఏకిపారేసిన టీమిండియా మాజీ క్రికెటర్లు..
Shikhar Dhawan
Venkata Chari
|

Updated on: May 11, 2025 | 12:19 PM

Share

Shikhar Dhawan: పాకిస్తాన్ శనివారం శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దుర్మార్గపు చర్యతో భారతీయులందరూ షాక్ అయ్యారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన మూడు గంటలకే, పొరుగు దేశం జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌పై వైమానిక దాడులు ప్రారంభించింది. దీని కారణంగా, అనేక నగరాల్లో బ్లాక్‌అవుట్ ప్రకటించారు. అదే సమయంలో, ఇప్పుడు టీం ఇండియా మాజీ డాషింగ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ పాకిస్తాన్ చర్యను తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు.

పాకిస్తాన్‌పై కోపంగా శిఖర్ ధావన్..

పాకిస్తాన్ ఏ స్థాయికి దిగజారిపోతుందో ఎవరూ ఊహించలేరు. దాని తుచ్ఛమైన చర్యల కారణంగా తరచుగా ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటుంది. గత శనివారం కూడా ఇలాంటిదే కనిపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాయంత్రం 5 గంటలకు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని ప్రకటించిన మూడు గంటలకే పాకిస్తాన్ భారతదేశంలో వైమానిక దాడులు ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్‌లోని సరుబ్‌ఫ్ శ్రీనగర్‌లో డ్రోన్ దాడి జరిగింది. దీని కారణంగా భారతదేశంలోని అనేక నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి

శిఖర్ ధావన్ పోస్ట్..

పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన పట్ల భారత బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ కూడా చాలా నిరాశ చెందాడు. పాకిస్తాన్‌ను చెడ్డ దేశంగా పిలుస్తూ ఒక పోస్ట్‌ను షేర్ చేశాడు. “ఈ చెడ్డ దేశం మరోసారి తన క్రూర బుద్ధిని ప్రపంచం మొత్తానికి చూపించింది” అని ఆయన రాసుకొచ్చాడు.

సోషల్ మీడియాలో శిఖర్ పోస్ట్ వైరల్..

దీనిపై పాకిస్తానీ వినియోగదారులు కూడా కామెంట్లు చేస్తున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై గబ్బర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు, ఆయన ‘ఆపరేషన్ సింధూర్’ను ప్రశంసిస్తూ స్పందించారు. శిఖర్ ధావన్‌తోపాటు టీం ఇండియాలోని ఇతర ఆటగాళ్లు కూడా శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో, కొంతమంది క్రికెటర్లు కూడా పాకిస్తాన్‌ను మందలించారు. అదే సమయంలో, వీరేంద్ర సెహ్వాగ్ తన ప్రతిచర్యను తెలియజేస్తూ, తన ఖాతాలో “కుక్క తోక ఎప్పుడూ వంకరగానే ఉంటుంది” అంటూ రాసుకొచ్చాడు.

అలాగే, హర్భజన్ సింగ్ మాట్లాడుతూ, “యుద్ధం మానవాళికి ఎప్పుడూ మంచిది కాదు. భారతదేశం శాంతిని ప్రేమించే దేశం. ఎప్పుడూ దురాక్రమణ చేయదు. కానీ ఒక దేశంగా, మేం శత్రువుల దురాక్రమణను ఎప్పటికీ సహించం. మన గడ్డపై ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే మా గొప్ప ప్రయత్నం. ప్రతి పౌరుడు సురక్షితంగా ఉండేలా చేసినందుకు మా రక్షణ దళాలకు సెల్యూట్. ప్రస్తుత అవసరం అయిన దౌత్య వివేకాన్ని ప్రదర్శించినందుకు మా రాజకీయ నాయకత్వానికి చాలా ధన్యవాదాలు. యుద్ధభూమిలో లేదా వెలుపల, భారతదేశం అన్ని విధాలుగా విజేత. #జైహింద్ #జైభారత్. #భారత ఆర్మీ” అంటూ రాసుకొచ్చాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..