Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత ఆటగాళ్లకు రూ.259 కోట్లు.. కనక వర్షం కురిపించిన ఫ్రాంచైజీలు?

IPL 2025: ఐపీఎల్ వేలంలో చాలా మంది ఆటగాళ్లు కోటీశ్వరులు అయ్యారు. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లపై రికార్డ్ బద్దలు కొట్టారు. అయితే, టీమిండియాకు టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఎంత డబ్బు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Team India: టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత ఆటగాళ్లకు రూ.259 కోట్లు.. కనక వర్షం కురిపించిన ఫ్రాంచైజీలు?
Team India Ipl 2025
Follow us
Venkata Chari

|

Updated on: Nov 29, 2024 | 12:52 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో చాలా మంది ఆటగాళ్లు భారీగా డబ్బులు సంపాదించారు. పంత్, అయ్యర్‌లు 25 కోట్లకు పైగా రాగా, వెంకటేష్ అయ్యర్ కూడా 20 కోట్ల రూపాయలకు పైగా రాబట్టగలిగాడు. అయితే, టి20 ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లు ఐపిఎల్‌లో ఎంత డబ్బు తీసుకుంటున్నారో తెలుసా? టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఆటగాళ్లు ఐపీఎల్ 2025లో మొత్తం రూ.259 కోట్లు సంపాదించబోతున్నారు. IPL 2025లో ఆ 15 మంది ఆటగాళ్ల మొత్తం జీతం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం?

పంత్‌కి ఎక్కువ డబ్బు..

టీ20 ప్రపంచ కప్ విజేత జట్టులో రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. ఈ ఆటగాడిని లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ నిలిచాడు. పంత్ తర్వాత విరాట్ కోహ్లి రూ.21 కోట్లు అందుకోబోతున్నాడు. విరాట్ కోహ్లిని RCB అట్టిపెట్టుకుంది. విరాట్ కోహ్లి ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా సారథ్యం వహించవచ్చు. మరి బౌలర్లకు ఎంత డబ్బు అందుతుందో తెలుసా? ప్రతి ఒక్కరూ తమ కష్టానికి తగిన ఫలాన్ని పొందారు.

బౌలర్లకు అధికమొత్తంలో డబ్బు..

2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన బౌలర్లు ఐపీఎల్‌లో కూడా భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు రూ.18 కోట్లు, జడేజాలకు రూ.18 కోట్లు లభించనున్నాయి. మహ్మద్ సిరాజ్ రూ.12.25 కోట్లు అందుకోనున్నారు. బ్యాట్స్‌మెన్స్ గురించి మాట్లాడితే, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్‌లు కూడా ఒక్కొక్కరు రూ.18 కోట్లు అందుకోబోతున్నారు. అక్షర్ పటేల్‌కు రూ.16.50 కోట్లు, సూర్యకుమార్ యాదవ్‌కు రూ.16.35 కోట్లు. కుల్దీప్ యాదవ్‌కు రూ.13.25 కోట్లు. శివమ్ దూబే 12 కోట్లు అందుకోబోతున్నాడు. కాగా, టీ20 ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.16.30 కోట్లు అందనున్నాయి. ఈ విధంగా ఈ మొత్తం రూ.259 కోట్లు అవుతుంది. టీ20 ప్రపంచకప్ గెలవడం వల్ల జట్టులోని ప్రతి ఆటగాడు లాభపడ్డాడనేది స్పష్టంగా తెలుస్తోంది. IPLలో, ఈ ఆటగాళ్లందరూ తమ తమ జట్లను గెలిపించడానికి ప్రయత్నిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
రోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం..భయాందోళనలో బీబీపేట్ గ్రామస్తులు
సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం..భయాందోళనలో బీబీపేట్ గ్రామస్తులు
బ్రాహ్మణులు శిఖ ఎందుకు ఉంచుతారు.? పండితులు ఏమి అంటున్నారంటే.?
బ్రాహ్మణులు శిఖ ఎందుకు ఉంచుతారు.? పండితులు ఏమి అంటున్నారంటే.?
WTC Final: డబ్ల్యూటీసీ విజేతగా సౌతాఫ్రికా.. 27 ఏళ్ల కల సాకారం
WTC Final: డబ్ల్యూటీసీ విజేతగా సౌతాఫ్రికా.. 27 ఏళ్ల కల సాకారం
సూపర్ న్యూస్.. సంతానలేమికి సొల్యూషన్ కనిపెట్టిన ఏఐ టెక్నాలజీ..
సూపర్ న్యూస్.. సంతానలేమికి సొల్యూషన్ కనిపెట్టిన ఏఐ టెక్నాలజీ..
టెస్ట్‌లో అడ్డంగా దొరికిపోయిన మహిళ
టెస్ట్‌లో అడ్డంగా దొరికిపోయిన మహిళ
జీలకర్ర, సోంపు రెండూ కలిపి ఇలా తీసుకుంటే.. శరీరంలో జరిగేది ఇదే..!
జీలకర్ర, సోంపు రెండూ కలిపి ఇలా తీసుకుంటే.. శరీరంలో జరిగేది ఇదే..!
మరోసారి ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే?
మరోసారి ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే?
మెట్ల కింద బాత్రూమ్ మంచిదేనా?.. వాస్తు ఏం చెబుతోంది?
మెట్ల కింద బాత్రూమ్ మంచిదేనా?.. వాస్తు ఏం చెబుతోంది?
12 ఏళ్లలో 100 సినిమాలు.. 31 ఏళ్ల వయసులోనే విమాన ప్రమాదంలో..
12 ఏళ్లలో 100 సినిమాలు.. 31 ఏళ్ల వయసులోనే విమాన ప్రమాదంలో..