AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: పాక్ చేతిలో టీమిండియా ప్రపంచకప్ ఆశలు.. సెమీస్ బెర్త్ దక్కాలంటే ఇలా జరగాల్సిందే!

మహిళల టీ20 ప్రపంచకప్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత జట్టు తడబడింది . షార్జా వేదికగా ఆదివారం (అక్టోబర్ 14) ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత జట్టు టీ20 ప్రపంచకప్ కల దాదాపుగా చెరిగిపోయింది. అయితే అధికారికంగా కాదు. టీమిండియా సెమీస్ చేరుకోవడానికి కొన్ని అవకాశాలున్నాయి.

T20 World Cup 2024: పాక్ చేతిలో టీమిండియా ప్రపంచకప్ ఆశలు.. సెమీస్ బెర్త్ దక్కాలంటే ఇలా జరగాల్సిందే!
Team India
Basha Shek
|

Updated on: Oct 14, 2024 | 10:56 AM

Share

మహిళల టీ20 ప్రపంచకప్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత జట్టు తడబడింది . షార్జా వేదికగా ఆదివారం (అక్టోబర్ 14) ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత జట్టు టీ20 ప్రపంచకప్ కల దాదాపుగా చెరిగిపోయింది. అయితే అధికారికంగా కాదు. టీమిండియా సెమీస్ చేరుకోవడానికి కొన్ని అవకాశాలున్నాయి. అంటే టీ20 ప్రపంచకప్ భవితవ్యం టీమిండియా భవితవ్యం నేడు పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో తేలిపోనుంది. గ్రూప్-ఎ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా జట్టు 8 పాయింట్లు సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు రెండో స్థానం కోసం భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా +0.322 నెట్ రన్ రేట్‌తో రెండో స్థానంలో ఉంది. అలాగే న్యూజిలాండ్ +0.282 నెట్ రన్ రేట్‌తో మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్ నెట్ రన్ రేట్ -0.488తో నాలుగో స్థానంలో ఉంది.

ఇక్కడ, భారత్ (+0.322), న్యూజిలాండ్ (+0.282) సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది, అయితే ఆ జట్టేవరో పాకిస్తాన్ నిర్ణయిస్తుంది. అంటే న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫలితం ఇక్కడ నిర్ణయాత్మకం. న్యూజిలాండ్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే.. నెట్ రన్ రేట్ సాయంతో భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒక వేళ న్యూజిలాండ్ గెలిస్తే 6 పాయింట్లతో సెమీస్‌లోకి ప్రవేశిస్తుంది. టీమ్ ఇండియా ఎలిమినేట్ అవుతుంది.ఒక వేళ న్యూజిలాండ్‌పై భారీ తేడాతో గెలిస్తే పాకిస్థాన్ జట్టు కూడా సెమీస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

సెమీస్ లెక్కలిలా..

  • న్యూజిలాండ్‌పై పాక్ గెలిస్తే భారత్ సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది.
  • పాకిస్థాన్‌పై గెలిస్తే న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది.
  • న్యూజిలాండ్‌పై 150 పరుగులు చేసి 53 పరుగుల తేడాతో గెలిస్తే పాకిస్థాన్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది .
  • న్యూజిలాండ్ 9.1 ఓవర్లలో లక్ష్యాన్ని (150 పరుగులు) ఛేదిస్తే, పాకిస్థాన్ సెమీస్‌లోకి ప్రవేశిస్తుంది.

అంటే టీమ్ ఇండియా సెమీఫైనల్ కు అర్హత సాధించాలంటే న్యూజిలాండ్ జట్టు ఓటమి పాలవ్వాలి. అదే సమయంలో పాకిస్థాన్ జట్టు భారీ తేడాతో గెలవకూడదు. ఈ రెండు సందర్భాల్లోనే నెట్ రన్ రేట్‌లో భారత జట్టు రెండు జట్లను అధిగమించి సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!