AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: గెలిచే మ్యాచ్‌లో డీలా పడిన భారత్.. టైగా ముగిసిన తొలి వన్డే

IND vs SL: కొలంబో ఆర్. భారత్-శ్రీలంక మధ్య ప్రేమదాస స్టేడియంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన టీమిండియా.. విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయింది. భారత జట్టు విజయానికి 1 పరుగు కావాల్సిన సమయంలో టీమిండియా వరుసగా రెండు వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.

IND vs SL: గెలిచే మ్యాచ్‌లో డీలా పడిన భారత్.. టైగా ముగిసిన తొలి వన్డే
Ind Vs Sl 1st Odi
Venkata Chari
|

Updated on: Aug 03, 2024 | 6:37 AM

Share

Sri Lanka vs India, 1st ODI: కొలంబో ఆర్. భారత్-శ్రీలంక మధ్య ప్రేమదాస స్టేడియంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన టీమిండియా.. విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయింది. భారత జట్టు విజయానికి 1 పరుగు కావాల్సిన సమయంలో టీమిండియా వరుసగా రెండు వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఇప్పుడు అదే కొలంబోలో ఆగస్టు 4న ఇరు జట్లు రెండో మ్యాచ్ ఆడనున్నాయి.

లంక ఆల్ రౌండర్ ప్రదర్శన..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. జట్టు తరపున యువ ఆల్‌రౌండర్ దునిత్ వెల్లాల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 67 పరుగులు చేశాడు. అతనితో పాటు శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక కూడా 56 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. లోయర్ ఆర్డర్‌లో వనిందు హసరంగా కూడా 24 పరుగులు చేసి జట్టును ఈ స్కోర్‌కి తీసుకెళ్లాడు. భారత్ తరపున అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ చెరో 2 వికెట్లు తీశారు.

రోహిత్‌ అద్భుత హాఫ్‌ సెంచరీ..

దీని తర్వాత లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు లక్ష్యం పెద్దగా లేదు. దీనికి తోడు టీ20 ప్రపంచకప్ గెలిచిన దాదాపు నెల రోజుల తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి దూకుడిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. కాబట్టి, ఈ మ్యాచ్‌లో టీమిండియా సులువుగా గెలుస్తుందని మొదట్లో అనిపించింది. కానీ, లంక ఆల్‌రౌండర్ వెల్లాల శుభ్‌మన్ గిల్, రోహిత్ వికెట్లను వరుసగా పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

స్పిన్నర్ల ఆధిపత్యం..

అనంతరం వచ్చిన విరాట్ కోహ్లి, వాషింగ్టన్ సుందర్, శ్రేయాస్ అయ్యర్ ఎక్కువ సేపు నిలవలేక లంక స్పిన్నర్లకు వికెట్ అప్పగించి పెవిలియన్ చేరారు. చివర్లో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ 57 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు విజయంపై ఆశలు కల్పించారు. కానీ, హసరంగ, అసలంక వీరిద్దరి వికెట్లు తీసి మ్యాచ్‌ను మళ్లీ తమకు అనుకూలంగా మార్చుకున్నారు.

ఇక్కడి నుంచి టీమిండియా ఇన్నింగ్స్‌ను చేజిక్కించుకున్న శివమ్ దూబే ధీటుగా బ్యాటింగ్ చేస్తూ జట్టును విజయానికి చేరువ చేశాడు. చివరకు జట్టుకు 15 బంతుల్లో 1 పరుగు అవసరం కాగా చేతిలో 2 వికెట్లు ఉన్నాయి. కానీ అసలంక శివమ్, అర్ష్‌దీప్ సింగ్‌లను వరుస బంతుల్లో ఎల్బీడబ్ల్యూ చేసి మ్యాచ్‌ని టైగా ముగించగలిగారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..