AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2022: శ్రీలంక ఓటమి భారత్‌పై తీవ్ర ప్రభావం.. బీ కేర్ ఫుల్ అంటోన్న మాజీలు.. ఎందుకంటే?

శ్రీలంక జట్టు ప్రస్తుతం క్వాలిఫయర్స్ ఆడుతోంది. క్వాలిఫయర్స్‌లో తమ గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంటే సూపర్-12లోకి ప్రవేశించగలదు. లేదంటే టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది.

T20 World Cup 2022: శ్రీలంక ఓటమి భారత్‌పై తీవ్ర ప్రభావం.. బీ కేర్ ఫుల్ అంటోన్న మాజీలు.. ఎందుకంటే?
T20 Wc Sri Lanka
Venkata Chari
|

Updated on: Oct 16, 2022 | 5:27 PM

Share

ఐసీసీ టీ 20 వరల్డ్‌కప్‌ ప్రారంభం కాగా తొలి మ్యాచ్‌లోనే ఆసియా కప్ విజేతకు ఘోర పరాభవం ఎదురైంది. క్వాలిఫయర్ రౌండ్‌లో శ్రీలంక జట్టు నమీబియా చేతిలో ఓడిపోయింది. ఈ సమయంలో విడుదలైన క్వాలిఫయర్‌లలో నాలుగు జట్లు సూపర్-12కి వెళ్తాయి. ఈ నాలుగు స్థానాల కోసం శ్రీలంక, వెస్టిండీస్, నమీబియా, స్కాట్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, యూఏఈ, జింబాబ్వేలు పోటీని ఇస్తున్నాయి. అయితే, క్వాలిఫయర్స్‌లో మొదటి మ్యాచ్ రాబోయే టోర్నమెంట్‌పై పెద్ద ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది టీమిండియాపై కూడా చాలా ప్రభావాన్ని చూపనుందని అంటున్నారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు ఏకపక్షంగా ఓడిపోయింది. ఆసియా కప్-2022 గెలిచిన శ్రీలంకకు ఇది మింగుడుపడలేని పరాజయం. అయితే, పసికూన నమీబియా మాత్రం ఈ విజయానికి పూర్తి అర్హులైంది. దీంతో మిగతా టీంలకు భారీ హెచ్చరికలు చేసింది. ఇందులో భారత్ కూడా ఉంటుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

భారత్‌కు ఇబ్బంది ఉండవచ్చు..

క్వాలిఫయర్స్‌లో శ్రీలంక గ్రూప్-ఎలో ఉంది. సూపర్-12లో భారత జట్టు నేరుగా ఆడనుంది. ఈ గ్రూప్‌లో ఇంకా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఈ గ్రూప్‌లోని క్వాలిఫైయర్లు గ్రూప్-ఎలో రెండో స్థానంలో నిలిచిన జట్టు చేరుతుంది. నమీబియా చేతిలో ఓడిన తర్వాత శ్రీలంక జట్టు గ్రూప్-ఎలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇటువంటి పరిస్థితిలో భారత జట్టులోని గ్రూప్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఈ గ్రూప్‌లో గట్టి పోటీ ఉండనుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియా ఫస్ట్ ప్లేస్ కోసం చాలా కష్టపడాల్సి రావచ్చు. ఇటీవల జరిగిన ఆసియాకప్‌లో భారత్‌పై శ్రీలంక విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే గ్రూపులో లంక ఉంటే మాత్రం.. భారత్ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచ కప్‌లో లంక టీం భారత్‌కు ఎన్నో షాకిల్చిన సంగతి తెలిసిందే. అందుకే రోహిత్ శర్మను ఈ విషయంలో మాజీలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

శ్రీలంక ఇంకా 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది..

అయితే శ్రీలంక ఇంకా రెండు క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అక్టోబర్ 18న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. దీని తర్వాత అక్టోబర్ 20న నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. శ్రీలంక ప్రస్తుతం ఈ రెండు జట్లను ఓడించాల్సిన అవసరం ఉంది. మరో మ్యాచ్‌లో ఓడిపోతే సూపర్-12కు వెళ్లడం కష్టంగా మారుతుంది.

టీ 20 ప్రపంచకప్‌లో మూడుసార్లు ఫైనల్ ఆడిన శ్రీలంక.. ఒక్కసారి విజయం సాధించింది. అదే సమయంలో రెండుసార్లు ఓడిపోయింది. 2014లో భారత్‌ను ఓడించి తొలిసారి టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2009లో శ్రీలంక ఫైనల్ చేరినా పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. 2012లో కూడా ఈ జట్టు ఫైనల్ చేరి వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది.