AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Test Records: బౌలరే కదా అని కొట్టిపారేసిన ఇంగ్లీషోళ్లు.. అరంగేట్రంలోనే 41 ఏళ్ల రికార్డ్‌ బ్రేక్.. బలైంది మనోడే

Milan Rathnayake: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన మిలన్ రత్నాయక్ కొత్త చరిత్ర సృష్టించాడు. 9వ ర్యాంకులో బరిలోకి దిగి అద్బుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు. మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

Test Records: బౌలరే కదా అని కొట్టిపారేసిన ఇంగ్లీషోళ్లు.. అరంగేట్రంలోనే 41 ఏళ్ల రికార్డ్‌ బ్రేక్.. బలైంది మనోడే
Eng Vs Sl Milan Rathnayake
Venkata Chari
|

Updated on: Aug 22, 2024 | 3:47 PM

Share

Milan Rathnayake: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన మిలన్ రత్నాయక్ కొత్త చరిత్ర సృష్టించాడు. 9వ ర్యాంకులో బరిలోకి దిగి అద్బుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు. మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టు 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో చేరిన ధనంజయ డిసిల్వా, మిలన్ రత్నాయకే 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత ధనంజయ డిసిల్వా (74) వికెట్‌ను కోల్పోయాడు.

మరోవైపు ఒంటరి పోరు కొనసాగించిన మిలన్ రత్నాయకే జట్టు స్కోరు 200 దాటించాడు. 135 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. ఈ 72 పరుగులతో టెస్టు క్రికెట్‌లో మిలన్ రత్నాయక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

అంటే టెస్టు క్రికెట్ చరిత్రలో 9వ నంబర్‌లో అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డు భారత్‌కు చెందిన బల్వీందర్ సంధు పేరిట ఉంది. బల్వీందర్ 1983లో పాకిస్థాన్‌పై 71 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

ఇప్పుడు 41 ఏళ్ల తర్వాత ఈ రికార్డును బద్దలు కొట్టడంలో మిలన్ రత్నయ్య సక్సెస్ అయ్యాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో 9వ ర్యాంక్‌తో మైదానంలోకి వచ్చిన మిలన్ 72 పరుగులు చేసి బల్వీందర్ సంధు పేరిట ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో తొలి మ్యాచ్‌లోనే మిలన్ రత్నయ్య సరికొత్త చరిత్ర సృష్టించాడు.

కోలుకున్న శ్రీలంక..

ఈ మ్యాచ్‌లో ధనంజయ డిసిల్వా (74), మిలన్ రత్నాయకే (72) హాఫ్ సెంచరీలతో 236 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెన్ డకెట్ (13), డేనియల్ లారెన్స్ (9) బ్యాటింగ్ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..