AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: 27 ఏళ్ల టీమిండియా ప్రస్థానానికి బీటలు.. చరిత్ర సృష్టించనున్న ఆతిథ్య జట్టు

Sri Lanka close to win ODI series against India after 27 Years: భారత్‌తో టీ20 సిరీస్‌ను 3-0తో కోల్పోయిన తర్వాత, వన్డే సిరీస్‌లో శ్రీలంక జట్టు (SL vs IND) నుంచి అద్భుతమైన ప్రదర్శన కనిపిస్తోంది. ఆతిథ్య జట్టు తన అద్భుత ప్రదర్శనతో తొలి వన్డేను టై చేసింది. ఆ తర్వాత రెండో వన్డేలో మెన్ ఇన్ బ్లూపై 32 పరుగుల తేడాతో గెలిచింది.

IND vs SL: 27 ఏళ్ల టీమిండియా ప్రస్థానానికి బీటలు.. చరిత్ర సృష్టించనున్న ఆతిథ్య జట్టు
Ind Vs Sl Records
Venkata Chari
|

Updated on: Aug 06, 2024 | 9:20 AM

Share

Sri Lanka close to win ODI series against India after 27 Years: భారత్‌తో టీ20 సిరీస్‌ను 3-0తో కోల్పోయిన తర్వాత, వన్డే సిరీస్‌లో శ్రీలంక జట్టు (SL vs IND) నుంచి అద్భుతమైన ప్రదర్శన కనిపిస్తోంది. ఆతిథ్య జట్టు తన అద్భుత ప్రదర్శనతో తొలి వన్డేను టై చేసింది. ఆ తర్వాత రెండో వన్డేలో మెన్ ఇన్ బ్లూపై 32 పరుగుల తేడాతో గెలిచింది. వన్డే ఫార్మాట్‌లో మూడేళ్ల తర్వాత భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు విజయం సాధించింది. ఇప్పుడు చరిత్ అసలంక నేతృత్వంలోని జట్టు భారత్‌పై చరిత్ర సృష్టించే దిశగా దూసుకుపోతోంది.

శ్రీలంక జట్టు 27 ఏళ్లుగా భారత్‌పై వన్డే సిరీస్‌ను గెలవలేదు..

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో మ్యాచ్ ఆగస్టు 7న జరగనుంది. మూడో మ్యాచ్‌లో శ్రీలంక జట్టు విజయం సాధిస్తే.. 27 ఏళ్ల తర్వాత టీమిండియాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టు బౌలింగ్‌ చాలా బలంగా ఉంది. ఇప్పుడు మూడో మ్యాచ్‌లోనూ అదే ప్రదర్శనను కొనసాగించాల్సి ఉంది.

శ్రీలంక చివరిసారిగా 1997లో భారత్‌పై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. ఆ సమయంలో, అరవింద్ డి సిల్వా, సనత్ జయసూర్య, అర్జున్ రణతుంగ, ముత్తయ్య మురళీధరన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.

రెండో మ్యాచ్‌లో టీమిండియాను ఓడించిన శ్రీలంక జట్టు నైతిక స్థైర్యాన్ని పొందింది. అదే సమయంలో గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మల వ్యూహం వన్డే సిరీస్‌లో ఫలించేలా కనిపించడం లేదు. అయితే, ఇప్పుడు అందరి దృష్టి మూడో మ్యాచ్‌పైనే ఉంది. ఇందులో ఉత్కంఠ అన్ని పరిమితులను మించిపోతుంది.

రోహిత్ శర్మ మినహా ఇతర భారత బ్యాట్స్‌మెన్స్ విఫలం..

సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో, శ్రీలంక భారత్‌కు 231 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. దానిని ఛేదించడం మెన్ ఇన్ బ్లూకు పెద్ద కష్టమేమీ కాదు. రోహిత్ శర్మ జట్టుకు శుభారంభం అందించిన తీరు చూస్తుంటే 40 ఓవర్లలోపే భారత జట్టు విజయం సాధిస్తుందని అనిపించింది. కానీ అతను తప్ప, జట్టులోని మరే ఇతర బ్యాట్స్‌మెన్ కీలక ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. దీని కారణంగా మెన్ ఇన్ బ్లూ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విధంగా రోహిత్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ వృథా అయింది.

రెండో మ్యాచ్‌లో కూడా హిట్‌మన్ 44 బంతుల్లో 64 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, 241 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించలేకపోయింది. ఇతర బ్యాట్స్‌మెన్‌ల ఫ్లాప్‌ ప్రదర్శనపై భారత అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..