AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: భారత్ కన్నా పాకే ముద్దు.. ఐపీఎల్‌కు కోహ్లీ కెప్టెన్ గుడ్ బై..!

IPL 2026 వేలానికి ముందు, ప్రతి జట్టు తమ రిటెన్షన్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ తమ స్టార్ ఆటగాడిని నిలుపుకోలేదు. అప్పటి నుంచి ఈ లెజెండరీ బ్యాట్స్‌మన్‌ను ఏ జట్టు కొనుగోలు చేయనుందోనని అంతా ఆసక్తి చూపించారు. కానీ, ఈ లోపే షాకింగ్ నిర్ణయం వచ్చింది.

IPL 2026: భారత్ కన్నా పాకే ముద్దు.. ఐపీఎల్‌కు కోహ్లీ కెప్టెన్ గుడ్ బై..!
Faf Du Plessis
Venkata Chari
|

Updated on: Nov 30, 2025 | 8:09 AM

Share

ఐపీఎల్ అభిమానులకు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ షాక్ ఇచ్చాడు. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ కోసం జరగనున్న వేలంలో తన పేరును నమోదు చేసుకోవడం లేదని ఆయన ప్రకటించారు. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్ తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఐపీఎల్‌కు ఎందుకు దూరమవుతున్నాడు?

అబుదాబి వేదికగా జరగనున్న ఐపీఎల్ వేలానికి కొన్ని రోజుల ముందు డు ప్లెసిస్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. “ఐపీఎల్‌లో 14 ఏళ్లు గడిపిన తర్వాత, ఈసారి వేలంలో నా పేరు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఇది చాలా పెద్ద నిర్ణయం. కానీ, ఎంతో కృతజ్ఞతతో తీసుకున్నాను” అని పేర్కొన్నాడు. అయితే, తాను క్రికెట్‌కు పూర్తిగా గుడ్ బై చెప్పడం లేదని, ఈసారి కొత్త సవాలును స్వీకరిస్తూ పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) రాబోయే సీజన్‌లో ఆడనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భారత్ తన హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానంలో ఉంటుందని, ఇది వీడ్కోలు కాదని అభిమానులకు భరోసా ఇచ్చారు.

ఐపీఎల్‌లో డు ప్లెసిస్ ప్రస్థానం ఫాఫ్ డు ప్లెసిస్ 2012లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ద్వారా ఐపీఎల్‌లోకి అడుగుపెట్టారు. చెన్నై తరపున అద్భుత ప్రదర్శన చేసి 2018, 2021లో టైటిల్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కు కెప్టెన్‌గా వ్యవహరించారు. గత సీజన్‌లో ఆయన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ వేలానికి ముందు ఆ ఫ్రాంచైజీ ఆయన్ను రిలీజ్ చేసింది.

డు ప్లెసిస్ గణాంకాలు..

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 154 మ్యాచ్‌లు ఆడిన డు ప్లెసిస్, 4773 పరుగులు సాధించారు. ఇందులో 39 అర్ధశతకాలు ఉన్నాయి. చెన్నై, పుణె, బెంగళూరు, ఢిల్లీ వంటి జట్ల తరపున ఆడిన ఆయన, లీగ్‌లో అత్యంత విజయవంతమైన విదేశీ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.

డు ప్లెసిస్ ఈ నిర్ణయంతో ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆయన మెరుపులను అభిమానులు మిస్ కానున్నారు. కాగా, ఈ నిర్ణయం వెనుక పలు కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్‌సీబీ తరపున అద్భుతంగా ఆడినా, తర్వాత ఏడాదిలోనే ఆర్‌సీబీ యాజమాన్యం రిలీజ్ చేసింది. అలాగే, గతేడాది ఢిల్లీ తరుపున ఆకట్టుకున్నా, ఈ ఏడాది ఢిల్లీ ఫ్రాంచైజీ కూడా రిలీజ్ చేసింది. దీంతో మనస్థాపానికి గురైన డు ప్లెసిస్.. ఈ కఠిన నిర్ణయం తీసుకన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..