Team India: అదే ముఖ్యం.. టీ20 ప్రపంచకప్నకు ముందే టీమిండియాను హెచ్చరించిన గంగూలీ..
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026కు సిద్ధమవుతున్న టీమిండియాకు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒక కీలకమైన సలహా చేశాడు. తొలి మ్యాచ్ లోనే కాదని, చివరి వరకు అద్భుతమైన ఫాంలో ఉండాలని, కీలక ఆటగాళ్లు ఈ బాధ్యతను తీసుకోవాలని తెలిపాడు.

Team India: సొంతగడ్డపై జరగనున్న 2026 టీ20 ప్రపంచకప్ను గెలవడానికి టీమ్ ఇండియా ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. 2024లో టోర్నీని గెలుచుకున్న సూర్యకుమార్ యాదవ్ సేన, ఈసారి కూడా కప్ను నిలబెట్టుకుని, వరుసగా మూడు టోర్నీల్లో (మొత్తంగా మూడు సార్లు) టీ20 ప్రపంచకప్ను గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించాలని అభిమానులు ఆశిస్తున్నారు. గంగూలీ కూడా భారత్ను ఫేవరెట్ జట్లలో ఒకటిగా భావిస్తున్నారు. అయితే, టోర్నీ ప్రారంభానికి ముందు గంగూలీ జట్టుకు ఒక కీలక సూచన చేశాడు.
“ఇలాంటి పెద్ద టోర్నమెంట్లలో సరైన సమయంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం, టోర్నీ సాంతం బాగా ఆడటం చాలా ముఖ్యం,” అని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో గంగూలీ పేర్కొన్నాడు. భారత్ అత్యంత బలమైన జట్టు అని, టోర్నీ మొదలయ్యాక తమ అత్యుత్తమ ఫామ్ను అందుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.
“భారత్ చాలా బలమైన జట్టు. ప్రస్తుతం అత్యుత్తమ స్థితిలో ఉందని నేను భావిస్తున్నాను. బ్యాటింగ్, స్పిన్ విభాగం, అలాగే బుమ్రా నేతృత్వంలోని సీమ్ బౌలింగ్.. ఇలా జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు,” అని గంగూలీ తెలిపాడు.
“గతానికి ఇప్పుడు పెద్దగా అర్థం ఉండకపోవచ్చు, కానీ ఈ కీలక టోర్నీలో తమ సత్తా చాటుతారని తెలుసు. నా ఫేవరెట్ జట్లలో భారత్ కచ్చితంగా ఒకటి,” అని ఆయన జోడించాడు.
టీమ్ ఇండియా జోరు..
2026 టీ20 ప్రపంచకప్నకు ముందు భారత్ అద్భుతమైన ఫామ్లో ఉంది. 2024లో టైటిల్ గెలిచినప్పటి నుంచి, సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ ఒక్క టీ20 సిరీస్ను కూడా కోల్పోలేదు.
భారత ఆటగాళ్ల ఆధిపత్యం ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అభిషేక్ శర్మ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నంబర్ 1 స్థానంలో ఉండగా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.
2026 టీ20 ప్రపంచకప్ ప్రాథమిక గ్రూప్ దశలో భారత్.. అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్లతో తలపడనుంది. ఈ గ్రూప్ నుంచి రెండు జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తాయి.
