AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 ఓవర్ల మ్యాచులో బౌలర్ల వెన్ను విరిచిన టీమిండియా ప్లేయర్.. 9 బంతుల్లో పెను విధ్వంసం..!

భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధనా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న హండ్రెడ్ టోర్నమెంట్‌లో పాల్గొంటోంది. ఈ టోర్నమెంట్‌లో తన బ్యాట్‌తో పరుగుల ప్రవాహం సృష్టిస్తోంది. మంధనా ప్రపంచంలోని అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరిగా రాణిస్తోంది.

6 ఓవర్ల మ్యాచులో బౌలర్ల వెన్ను విరిచిన టీమిండియా ప్లేయర్.. 9 బంతుల్లో పెను విధ్వంసం..!
Smriti Mandhana
Venkata Chari
|

Updated on: Jul 30, 2021 | 1:38 PM

Share

Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధనా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న హండ్రెడ్ టోర్నమెంట్‌లో పాల్గొంటోంది. ఈ టోర్నమెంట్‌లో తన బ్యాట్‌తో పరుగుల ప్రవాహం సృష్టిస్తోంది. మంధనా ప్రపంచంలోని అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరిగా రాణిస్తోంది. స్మృతి మంధనా తన బ్యాట్‌తో కలకలం సృష్టించింది. మహిళల టీ 20 క్రికెట్‌లో ఈ భారత బ్యాటర్ భీభత్సం సృషించి హాఫ్ సెంచరీ బాదేసింది. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి, బౌలర్లను ఉతికి ఆరేసింది. స్మృతి మంధనా ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌ను కియా సూపర్ లీగ్ మ్యాచ్‌లో ఆడింది.

వెస్ట్రన్ స్టార్మ్, లాంక్షైర్ మెరుపుల మధ్య ఈ మ్యాచ్ 29 జులై 2018 న జరిగింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 6 ఓవర్లకు తగ్గించారు. వెస్ట్రన్ స్టార్మ్ తరుపున బరిలోకి దిగిన మంధనా.. క్రీజులోకి వచ్చిన వెంటనే బ్యాట్‌ను ఝులిపించడం ప్రారంభించింది. 6 ఓవర్ల ఆట పూర్తయ్యే సమయానికి, ఆమె 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పింది. 18 బంతుల్లో మహిళల టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డెవైన్‌ ఈ రికార్డును సాధించింది. తాజాగా ఆ రికార్డును మంధనా సమయం చేసింది. 19 బంతుల్లో 52 నాటౌట్ ఇన్నింగ్స్‌తో సంచలనం చేసింది. కేవలం 9 బంతుల్లో 5 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 44 పరుగులు చేసింది. మంధనాతో పాటు, వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ రాచెల్ ప్రీస్ట్ 13 బంతుల్లో 25 పరుగులు సాధించింది. జట్టు స్కోరును 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 85 పరుగులకు చేర్చారు.

సోఫీ డెవిన్ థ్రిల్లింగ్ మ్యాచ్… లక్ష్యాన్ని చేరుకోవడానికి లాంక్షైర్ బృందం ఎంతగానో ప్రయత్నించింది. కానీ, చివరికి విజయం వెస్ట్రన్ స్టార్మ్ జట్టునే వరించింది. లాంక్షైర్ టీం 6 ఓవర్లలో 67 పరుగులు చేయగలిగింది. 18 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయింది. అయితే లాంక్షైర్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. 21 బంతుల్లో 46 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినా.. మ్యాచ్‌ను గెలిపించలేకపోయింది. ఇందులో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. మరో బ్యాట్స్‌మెన్ రాచెల్ హేన్స్ 15 బంతుల్లో 18 పరుగులు చేసింది. ఆమె కేవలం రెండు బౌండరీలు మాత్రమే చేసింది. స్మృతి మంధనా భారత్ తరపున 81 టీ 20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 26.04 సగటుతో 1901 పరుగులు సాధించింది. ఇందులో 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

Also Read: IND vs SL: మరో ఇద్దరికి కరోనా పాజిటివ్.. శ్రీలంకలోనే ఆ ఎనిమిది మంది క్రికెటర్లు

భారత ఆల్‌రౌండర్‌తో గొడవ పడ్డాడు.. కుంబ్లే రికార్డుపై కన్నేశాడు.. ఆ దిగ్గజ బౌలర్ ఎవరంటే?