AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL-15: “రాజస్థాన్ గెలిస్తే బాగుంటుంది.. కానీ గుజరాతే గెలుస్తుంది”.. షోయబ్ అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్

ఐపీల్-15(IPL-15) సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలవాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ ఆకాంక్షించారు. ట్రోఫీ సాధించి క్రికెట్ దిగ్గజం, దివంగత షేన్‌ వార్న్‌ కు నివాళి అర్పించాలని కోరారు. అయితే అదే సమయంలో..

IPL-15: రాజస్థాన్ గెలిస్తే బాగుంటుంది.. కానీ గుజరాతే గెలుస్తుంది.. షోయబ్ అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్
Shoaib Aktar
Ganesh Mudavath
|

Updated on: May 29, 2022 | 7:19 PM

Share

ఐపీల్-15(IPL-15) సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలవాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆకాంక్షించారు. ట్రోఫీ సాధించి క్రికెట్ దిగ్గజం, దివంగత షేన్‌ వార్న్‌ కు నివాళి అర్పించాలని కోరారు. అయితే అదే సమయంలో.. గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans) కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ జట్టే విజేతగా నిలుస్తుందని అంచనా వేశాడు. ఐపీల్ టోర్నీ ప్రారంభమైన 2008 లో రాజస్థాన్‌ తొలిసారి విజేతగా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆ జట్టు ఫైనల్‌కు చేరింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ‘14 ఏళ్ల తర్వాత రాజస్థాన్‌ ఫైనల్‌ చేరింది. షేన్ వార్న్‌కు నివాళిగా ఆ జట్టు గెలవాలని బలంగా కోరుకుంటున్నా. ఇప్పటికే ఆ జట్టు ఎన్నో కష్టాలకోర్చి ఫైనల్ వరకు చేరింది. అయితే గుజరాత్‌ కూడా బాగా ఆడుతోంది.’ అని అక్తర్‌ అన్నారు. రాజస్థాన్‌ తొలి సీజన్‌ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఫైనల్‌ చేరడంతో దూకుడుగా ఆడుతోందని, మరోవైపు.. గుజరాత్‌ కూడా తొలి సీజన్‌లో తమ మార్క్‌ చూపించాలని తాపత్రయపడుతోందని అక్తర్ వ్యాఖ్యానించారు.

ఐపీఎల్‌-2008లో రాజస్థాన్ రాయల్స్‌కు షేన్ వార్న్ సారథ్యం వహించారు. అరంగేట్రంలోనే జట్టుకు టైటిల్‌ అందించి చరిత్ర సృష్టించారు. అయితే, ఆ తర్వాత రాజస్థాన్‌ మళ్లీ ఫైనల్‌ చేరుకోవడానికి పద్నాలుగేళ్లు పట్టింది. ఐపీఎల్‌-2022 తో మెగా టోర్నీలో అడుగుపెట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ లో ఉన్న జట్ల కంటే ముందే ఫైనల్‌కు చేరింది.

మరికొద్ది గంటల్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మొదలు కానుంది. ఈ ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మొతేరా స్టేడియంలో రాత్రి 8 గంటలకు జరగనున్న ఫైనల్ మ్యా్చ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలడుతుండగా.. ఈ రెండింటిలో ఈసారి టైటిల్ కొట్టేదెవరు? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడలు వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Follow Us
కోహ్లీతో పోలికేంటి బాస్.. ఈ లెక్కలు చూస్తే మెంటలెక్కిపోద్దంతే..!
కోహ్లీతో పోలికేంటి బాస్.. ఈ లెక్కలు చూస్తే మెంటలెక్కిపోద్దంతే..!
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.
ఆర్బీఐ కీలక నిర్ణయం: బ్యాంక్‌ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు
ఆర్బీఐ కీలక నిర్ణయం: బ్యాంక్‌ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు
ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు మృతి
ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు మృతి
21 వేల పానీపూరీలతో 13అడుగుల వినూత్న వినాయక విగ్రహం.. వీడియో వైరల్
21 వేల పానీపూరీలతో 13అడుగుల వినూత్న వినాయక విగ్రహం.. వీడియో వైరల్
భారత మహిళా క్రికెటర్లు బీసీసీఐ జెర్సీ ఎందుకు వేసుకోలేదు?
భారత మహిళా క్రికెటర్లు బీసీసీఐ జెర్సీ ఎందుకు వేసుకోలేదు?
డీజేలో మోత మోగిపోతున్న సాంగ్.. కుర్రాళ్లకు ఫుల్ జోషిస్తున్న పాట..
డీజేలో మోత మోగిపోతున్న సాంగ్.. కుర్రాళ్లకు ఫుల్ జోషిస్తున్న పాట..
మరణానికి ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయా? శరీరంలో జరిగే మార్పులివే!
మరణానికి ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయా? శరీరంలో జరిగే మార్పులివే!
కేవలం రూ.51కే అన్‌లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్
కేవలం రూ.51కే అన్‌లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్
కొడుకు కొడుతున్నాడని పోలీసులకు ఫోన్ చేసిన తల్లి.. కట్‌చేస్తే
కొడుకు కొడుతున్నాడని పోలీసులకు ఫోన్ చేసిన తల్లి.. కట్‌చేస్తే