AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL-15: “రాజస్థాన్ గెలిస్తే బాగుంటుంది.. కానీ గుజరాతే గెలుస్తుంది”.. షోయబ్ అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్

ఐపీల్-15(IPL-15) సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలవాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ ఆకాంక్షించారు. ట్రోఫీ సాధించి క్రికెట్ దిగ్గజం, దివంగత షేన్‌ వార్న్‌ కు నివాళి అర్పించాలని కోరారు. అయితే అదే సమయంలో..

IPL-15: రాజస్థాన్ గెలిస్తే బాగుంటుంది.. కానీ గుజరాతే గెలుస్తుంది.. షోయబ్ అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్
Shoaib Aktar
Ganesh Mudavath
|

Updated on: May 29, 2022 | 7:19 PM

Share

ఐపీల్-15(IPL-15) సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలవాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆకాంక్షించారు. ట్రోఫీ సాధించి క్రికెట్ దిగ్గజం, దివంగత షేన్‌ వార్న్‌ కు నివాళి అర్పించాలని కోరారు. అయితే అదే సమయంలో.. గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans) కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ జట్టే విజేతగా నిలుస్తుందని అంచనా వేశాడు. ఐపీల్ టోర్నీ ప్రారంభమైన 2008 లో రాజస్థాన్‌ తొలిసారి విజేతగా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆ జట్టు ఫైనల్‌కు చేరింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ‘14 ఏళ్ల తర్వాత రాజస్థాన్‌ ఫైనల్‌ చేరింది. షేన్ వార్న్‌కు నివాళిగా ఆ జట్టు గెలవాలని బలంగా కోరుకుంటున్నా. ఇప్పటికే ఆ జట్టు ఎన్నో కష్టాలకోర్చి ఫైనల్ వరకు చేరింది. అయితే గుజరాత్‌ కూడా బాగా ఆడుతోంది.’ అని అక్తర్‌ అన్నారు. రాజస్థాన్‌ తొలి సీజన్‌ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఫైనల్‌ చేరడంతో దూకుడుగా ఆడుతోందని, మరోవైపు.. గుజరాత్‌ కూడా తొలి సీజన్‌లో తమ మార్క్‌ చూపించాలని తాపత్రయపడుతోందని అక్తర్ వ్యాఖ్యానించారు.

ఐపీఎల్‌-2008లో రాజస్థాన్ రాయల్స్‌కు షేన్ వార్న్ సారథ్యం వహించారు. అరంగేట్రంలోనే జట్టుకు టైటిల్‌ అందించి చరిత్ర సృష్టించారు. అయితే, ఆ తర్వాత రాజస్థాన్‌ మళ్లీ ఫైనల్‌ చేరుకోవడానికి పద్నాలుగేళ్లు పట్టింది. ఐపీఎల్‌-2022 తో మెగా టోర్నీలో అడుగుపెట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ లో ఉన్న జట్ల కంటే ముందే ఫైనల్‌కు చేరింది.

మరికొద్ది గంటల్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మొదలు కానుంది. ఈ ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మొతేరా స్టేడియంలో రాత్రి 8 గంటలకు జరగనున్న ఫైనల్ మ్యా్చ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలడుతుండగా.. ఈ రెండింటిలో ఈసారి టైటిల్ కొట్టేదెవరు? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడలు వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Follow Us
మీ ఏజ్‌ను బట్టి మీరు రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసా..?
మీ ఏజ్‌ను బట్టి మీరు రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసా..?
ఇక వీరు రైల్వే టికెట్స్‌ బుక్‌ చేసుకోలేరు.. భారీ షాకిచ్చిన IRCTC
ఇక వీరు రైల్వే టికెట్స్‌ బుక్‌ చేసుకోలేరు.. భారీ షాకిచ్చిన IRCTC
ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు!
ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు!
రామ్ చరణ్ 'పెద్ది'సినిమాకు రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రామ్ చరణ్ 'పెద్ది'సినిమాకు రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కంపెనీ బంపర్ ఆఫర్..సిగరెట్ తాగని ఉద్యోగులకు 6 రోజులు అదనపు సెలవు!
కంపెనీ బంపర్ ఆఫర్..సిగరెట్ తాగని ఉద్యోగులకు 6 రోజులు అదనపు సెలవు!
టీ షర్ట్‌‌లో T అంటే ఏంటో తెలుసా..? దీని వెనుకున్న కథ తెలిస్తే..
టీ షర్ట్‌‌లో T అంటే ఏంటో తెలుసా..? దీని వెనుకున్న కథ తెలిస్తే..
టీమిండియా టీ20 జట్టు.. కెప్టెన్‌గా శ్రేయాస్.. వైభవ్ ఎంట్రీ
టీమిండియా టీ20 జట్టు.. కెప్టెన్‌గా శ్రేయాస్.. వైభవ్ ఎంట్రీ
ఈ రెండు బ్యాంకులపై షాకిచ్చిన ఆర్బీఐ.. భారీ జరిమానా.. కారణం ఇదే!
ఈ రెండు బ్యాంకులపై షాకిచ్చిన ఆర్బీఐ.. భారీ జరిమానా.. కారణం ఇదే!
ఇది షిప్ కాదు,సముద్రంపై తేలియాడే అద్భుత నగరం! 80 వేల మంది జనాభాతో
ఇది షిప్ కాదు,సముద్రంపై తేలియాడే అద్భుత నగరం! 80 వేల మంది జనాభాతో
హైదరాబాద్‌లో అక్రమ ఫార్మా నెట్‌వర్క్ బట్టబయలు.. DCA దాడుల్లో..
హైదరాబాద్‌లో అక్రమ ఫార్మా నెట్‌వర్క్ బట్టబయలు.. DCA దాడుల్లో..