AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోరాహోరీ మ్యాచ్‌లో కోల్‌కతాపై బెంగళూరు విజయం

ఐపీఎల్ 2019లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎట్టకేలకి రెండో విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి (100: 58 బంతుల్లో 9×4, 4×6) మెరుపు శతకం బాదడంతో బెంగళూరు జట్టు 10 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కోహ్లితో పాటు మొయిన్ అలీ (66: 28 బంతుల్లో 5×4, 6×6) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు […]

హోరాహోరీ మ్యాచ్‌లో కోల్‌కతాపై బెంగళూరు విజయం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 20, 2019 | 6:13 AM

Share

ఐపీఎల్ 2019లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎట్టకేలకి రెండో విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి (100: 58 బంతుల్లో 9×4, 4×6) మెరుపు శతకం బాదడంతో బెంగళూరు జట్టు 10 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కోహ్లితో పాటు మొయిన్ అలీ (66: 28 బంతుల్లో 5×4, 6×6) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 213 పరుగులు చేయగా.. ఛేదనలో నితీశ్ రాణా (85 నాటౌట్: 46 బంతుల్లో 9×4, 5×6), ఆండ్రీ రసెల్ (65: 25 బంతుల్లో 2×4, 9×6) చెలరేగి కోల్‌కతా జట్టులో ఆశలు రేపారు. కానీ.. ఆఖర్లో పుంజుకున్న బెంగళూరు బౌలర్లు ఎట్టకేలకి ఆ జట్టుని 203/5 కే పరిమితం చేశారు. ఈ సీజన్‌లో బెంగళూరుకి ఇది రెండో గెలుపుకాగా.. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ కోల్‌కతా ఓడిపోయింది.