AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Pak 4500Crore Loss : భారత్-పాక్ మ్యాచ్ లేకపోతే క్రికెట్ దివాళా.. రూ. 4500 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా?

Ind vs Pak 4500Crore Loss : పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఒక్క మొండి నిర్ణయం ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాక్ ప్రకటించడంతో సుమారు రూ.4500 కోట్ల భారీ నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఒకానొక దశలో ఈ నష్టం గ్లోబల్ క్రికెట్ ఎకానమీని కుప్పకూల్చేలా ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Ind vs Pak 4500Crore Loss : భారత్-పాక్ మ్యాచ్ లేకపోతే క్రికెట్ దివాళా.. రూ. 4500 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా?
Ind Vs Pak 4500crore Loss
Rakesh
|

Updated on: Feb 02, 2026 | 8:09 PM

Share

Ind vs Pak 4500Crore Loss : పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఒక్క మొండి నిర్ణయం ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాక్ ప్రకటించడంతో సుమారు రూ.4500 కోట్ల భారీ నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఒకానొక దశలో ఈ నష్టం గ్లోబల్ క్రికెట్ ఎకానమీని కుప్పకూల్చేలా ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి 15న శ్రీలంకలో జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ రద్దయితే ఎవరెవరికి ఎంత నష్టమో వివరంగా తెలుసుకుందాం.

భారత్ మరియు పాకిస్థాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ కేవలం ఆట మాత్రమే కాదు, అదొక భారీ వాణిజ్య సామ్రాజ్యం. ఫిబ్రవరి 1న పాక్ ప్రభుత్వం టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో ఆడబోమని చేసిన ప్రకటన ఇప్పుడు ఐసీసీని, బ్రాడ్‌కాస్టర్లను నిద్రపోనివ్వడం లేదు. ఈ ఒక్క మ్యాచ్ విలువ సుమారు 500 మిలియన్ డాలర్లు (రూ.4500 కోట్లు) అని అంచనా. ఇందులో బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ల అమ్మకాలు అన్నీ కలిసి ఉన్నాయి.

ఈ మ్యాచ్ కోసం ప్రకటనల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేవలం 10 సెకన్ల అడ్వర్టైజ్‌మెంట్ స్లాట్ ధర రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉంది. ప్రపంచకప్ మొత్తంలో ఇదే అత్యంత ఖరీదైన స్లాట్. ఈ మ్యాచ్ గనుక జరగకపోతే, కేవలం ప్రకటనల ద్వారా వచ్చే రూ.300 కోట్ల ఆదాయాన్ని బ్రాడ్‌కాస్టర్లు కోల్పోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జియోస్టార్ వంటి దిగ్గజ సంస్థలు ఐసీసీని దీనిపై వివరణ కోరుతున్నాయి.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం ఐసీసీ నుంచి ఏటా 5.75% రెవెన్యూ షేర్ అందుకుంటోంది. అంటే సుమారు రూ.316 కోట్లు. ఒకవేళ పాక్ గనుక భారత్‌తో మ్యాచ్ ఆడకుండా వాకౌట్ చేస్తే, ఐసీసీ ఈ నిధులను నిలిపివేసే అవకాశం ఉంది. ఇది పాక్ క్రికెట్ బోర్డుకు కోలుకోలేని దెబ్బ అవుతుంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, మ్యాచ్ రద్దయితే భారత్, పాక్ బోర్డులకు చెరో రూ.200 కోట్ల ప్రత్యక్ష నష్టం వాటిల్లుతుంది. భారత్ ఈ నష్టాన్ని తట్టుకోగలదు కానీ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు ఇది ఆత్మహత్యాసదృశ్యమే.

భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ జరిగినా స్టేడియాలు కిక్కిరిసిపోతాయి. ఫిబ్రవరి 15 మ్యాచ్ కోసం ఇప్పటికే లక్షలాది టికెట్లు అమ్ముడయ్యాయి. మ్యాచ్ రద్దయితే నిర్వాహకులు అభిమానులకు టికెట్ డబ్బులను రీఫండ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా వందల కోట్ల నష్టంతో కూడుకున్న పని. ఐసీసీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక ముందస్తుగా ప్రకటించిన బహిష్కరణ ఇప్పుడు గ్లోబల్ క్రికెట్ వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టింది.

పాకిస్థాన్ నిర్ణయంపై ఐసీసీ తీవ్రంగా స్పందించింది. “ప్రపంచ క్రీడల స్ఫూర్తికి ఇది విరుద్ధం” అని పేర్కొంటూనే, పాక్ క్రికెట్ భవిష్యత్తుపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. బహుశా పాకిస్థాన్‌ను భవిష్యత్తు టోర్నీల నుంచి నిషేధించడం లేదా భారీ జరిమానాలు విధించడం వంటి చర్యలు ఉండవచ్చు. వచ్చే 24 గంటల్లో పాక్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, క్రికెట్ ప్రపంచంలో ఒక భారీ ఆర్థిక విపత్తు తప్పేలా లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..