స్కై, కోహ్లీ, బట్లర్ జుజుబీ.. టీ20లకే మొగుడు.. డబుల్ సెంచరీ కొట్టేది ఆ ప్లేయరే..

క్రికెట్ ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తుంది పొట్టి ఫార్మాట్. ధనాధన్ టీ20 అంటే చాలు.. బౌండరీలు, సిక్సర్ల మోత మోగిపోవాల్సిందే. ఈ ఫార్మాట్‌లో బ్యాటర్లదే హవా. బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. ఇటీవల జరుగుతోన్న ఐపీఎల్ 2024 ఇందుకు నిదర్శనం అని చెప్పొచ్చు..

స్కై, కోహ్లీ, బట్లర్ జుజుబీ.. టీ20లకే మొగుడు.. డబుల్ సెంచరీ కొట్టేది ఆ ప్లేయరే..
Mumbai Indians
Follow us

|

Updated on: Apr 19, 2024 | 1:36 PM

క్రికెట్ ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తుంది పొట్టి ఫార్మాట్. ధనాధన్ టీ20 అంటే చాలు.. బౌండరీలు, సిక్సర్ల మోత మోగిపోవాల్సిందే. ఈ ఫార్మాట్‌లో బ్యాటర్లదే హవా. బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. ఇటీవల జరుగుతోన్న ఐపీఎల్ 2024 ఇందుకు నిదర్శనం అని చెప్పొచ్చు. ఎన్నడూ లేనట్టుగా ఈ సీజన్‌లో టాప్ 5 అత్యధిక భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఒకప్పుడు ఐపీఎల్‌లో 200 పరుగులు కొట్టాలంటే.. అదొక రేర్ ఫీట్‌లా ఉండేది. అయితే ఇప్పుడు అది సర్వసాధారణమైపోయింది. ఒక్కోసారి టీ20 క్రికెట్‌లో 200 పరుగులు కొట్టినా గెలుపు సాధ్యం కానీ పరిస్థితులు వచ్చేశాయి. ప్రస్తుతం బ్యాటర్లందరూ కూడా 200కి పైగా స్ట్రైక్‌ రేటుతో బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ను ఐపీఎల్‌లో ఎవరు ఫస్ట్ 200 కొడతారు అని అడిగితే.? దానికి అతడు చెప్పిన సమాధానం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

టీ20లలోనే కాదు.. ఐపీఎల్‌లోనూ డబుల్ సెంచరీ కొట్టే సత్తా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ఉందని జోస్యం చెప్పాడు కేన్ మామ. వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన రోహిత్.. ఐపీఎల్‌లోనూ ఈ ఫీట్ సాధించడం పెద్ద కష్టమేమి కాదని తెలిపాడు. కాగా, ప్రస్తుతం టీ20ల్లో అత్యధిక స్కోరు క్రిస్ గేల్(175) పేరిట ఉండగా.. ర్యాంకుల్లో అగ్రస్థానం సూర్యకుమార్ యాదవ్ దక్కించుకున్నాడు. ఇక రోహిత్ శర్మ.. ఇటీవల చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 105 పరుగులు సాధించిన విషయం తెలిసిందే.

Latest Articles