AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రేషన్‌ కార్డు, కొత్త ఫించన్ల కోసం ఎదురు చూసే వారికి గుడ్‌న్యూస్.. అప్లై చేసిన 48 గంటల్లోనే..

రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ధరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే రేషన్ కార్డును జారీ చేసే విధంగా వ్యవస్థను తీర్చి దిద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అర్హత గల ప్రతి ఫ్యామిలీకి వీలైనంత వేగంగా సంక్షేమ పథకాలను అందించాలనే లక్ష్యంలో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

Telangana: రేషన్‌ కార్డు, కొత్త ఫించన్ల కోసం ఎదురు చూసే వారికి గుడ్‌న్యూస్.. అప్లై చేసిన 48 గంటల్లోనే..
Telangana New Ration Card Updates
Anand T
|

Updated on: Jul 05, 2026 | 7:31 PM

Share

రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే రేషన్ కార్డును జారీ చేసే విధంగా వ్యవస్థను తీర్చిదిద్దామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అర్హత గల ప్రతి కుటుంబానికి వీలైనంత వేగంగా సంక్షేమ పథకాలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ అన్ని పథకాలు అందేలా చూస్తామని స్పష్టం చేశారు.

ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా వేగవంతమైన సేవలు

లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న ఒకటి రెండ్రోజుల్లోనే రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని మంత్రి తెలిపారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, పారదర్శకంగా వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ ద్వారా సన్న బియ్యాన్ని అందిస్తున్నామని, దీనివల్ల పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. రేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, ప్రతి కుటుంబానికి ప్రయోజనాలు చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని వివరించారు.

ఓఆర్ఆర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు

ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్న పేదలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో సుమారు లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఇళ్ల కేటాయింపునకు సంబంధించిన అర్హుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తామని, ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా కేవలం అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

రెండు లక్షల మంది ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు

మహిళల సంక్షేమానికి ప్రస్తుత ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందులో భాగంగానే త్వరలోనే రాష్ట్రంలో సుమారు రెండు లక్షల మంది ఒంటరి మహిళలకు కొత్తగా పెన్షన్లు జారీ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా సమాజంలో ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు వంటి కీలక పథకాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు పూర్తి అండగా నిలిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us